Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోల్డెన్ కప్ అందుకున్న తర్వాత మనస్సు మార్చుకున్న మెస్సీ

Messi
, సోమవారం, 19 డిశెంబరు 2022 (11:06 IST)
ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఖతార్ వేదికగా ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో విశ్వవిజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్ దాకా సాగిన మ్యాచ్‌లో ఆద్యంతం ఉత్కంఠతతో జరిగింది. ఈ వరల్డ్ కప్ తర్వాత జాతీయ జట్టు నుంచి రైటర్ అవుతానని మెస్సీ గతంలో ప్రకటించారు. 
 
అయితే, ఫైనల్‌ గెలిచి కప్ ఆదుకున్నాక తన మనస్సు మార్చుకుని సంచలన ప్రకటన చేశాడు. జాతీయ ఫుట్‌బాల్ జట్టు నుంచి వైదొలగడం లేదని చెప్పాడు. ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో కలిసి మరిన్ని మ్యాచ్‌లలో ఆడాలని అనుకున్నట్టు చెప్పారు. దీంతో మెస్సీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
కాగా, ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా జట్టు గెలుచుకున్న ర్వాత మెస్సీ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ మాట్లాడుతూ, ఇది నమ్మశక్యం కావట్లేదు. దేవుడు నాకు కప్ ఇవ్వబోతున్నాడని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది మాకు చాలా సంతోషం కలిగించింది అని చెప్పుకొచ్చాడు. అలాగే, తనకు జాతీయ జట్టులో కొనసాగాలని ఉంది అని తన మనస్సులో మాటను బహిర్గతం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిఫా వరల్డ్ కప్ 2022 - 'గోల్డెన్ బూట్' ఎవరికో తెలుసా?