Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ : మీరాభాయ్ 'గోల్డెన్ గాళ్'

వరల్డ్ ఛాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ ఛాను 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని భారత్‌‌‌ కీర్తిని ఇనుమడింపజేసింది.

Advertiesment
CWG 2018
, గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:33 IST)
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలుత రజత పతకంతో బోణీ చేసింది. పురుషులు వెయిట్ లిఫ్టింగ్‌లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన గురురాజా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
ఈ క్రీడల తొలి రోజైన గురువారం బంగారు పతకం వచ్చింది. వరల్డ్ ఛాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ ఛాను 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని భారత్‌‌‌ కీర్తిని ఇనుమడింపజేసింది. తన శరీరం బరువుకు రెట్టింపు కంటే ఎక్కువ బరువును ఎత్తడం ద్వారా (103 కిలోలు, 107 కిలోలు, 110 కిలోలు) ఓవరాల్ గేమ్ రికార్డును సొంతం చేసుకుంది. తద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
దీనిపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. 'గోల్డెన్ గాళ్' (స్వర్ణబాల) అంటూ మీరాభాయ్ ఛానుపై బిగ్ బి ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే, దేశం నలమూలల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, 21వ కామన్వెల్త్ క్రీడల ప్రారంభవేడుకలు బుధవారం అట్టహాసంగా జరుగగా, ప్రధాన పోటీలు గురువారం నుంచి మొదలయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామన్వెల్త్ క్రీడలు 2018 : భారత్ బోణి...