Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం

squash gold
, గురువారం, 5 అక్టోబరు 2023 (14:28 IST)
ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. స్క్వాష్ పోటీలో దీపికా పల్లికల్, హరిందర్ సంధు జోడీ విజయం సాధించింది. ఈ జంట మలేషియాపై 11-10, 11-10 తేడాతో భారత జంట గెలుపొందింది. దీంతో భారత్ ఖాతాలోకి 20 బంగారు పతకాలకు చేరింది. 
 
మరోవైపు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రణయ్ కూడా మెడల్‌ను ఖాయం చేసుకున్నారు. సీనియర్ స్క్వాష్ ప్లేయర్ సౌరభ్ ఘోషల్ కూడా సింగిల్స్ విభాగంలో పతకంపై కన్నేశారు. అంతకుముందు అర్చరీలో కాంపౌండ్ మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం గెలుచుకుంది. ప్రస్తుతం భారత్‌ పతకాల సంఖ్య 83కి చేరింది. వీటిలో 20 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.
 
పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో భూటాన్‌పై 235-221 తేడాతో  విజయం సాధించింది. ఓజాస్‌ ప్రవిణ్‌-అభిషేక్-ప్రథమేష్ సమాధాన్‌తో కూడిన బృందం భూటాన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో సెమీస్‌లో చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడనుంది. బాక్సర్లు అంతిమ్‌ పంగల్‌ (మహిళల 53 కేజీల విభాగం), మన్సి (మహిళల 50 కేజీల విభాగం) కాంస్య పతకం కోసం తలపడనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా క్రీడలు : జావెలిన్ త్రో - నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్