స్విమ్మింగ్ పోటీల సందర్భంగా జాతీయ క్రీడాకారిణి ఒకరు గుండె పోటుతో మరణించిన సంఘటన కోల్కతాలో చోటు చేసుకుంది. పోటీ సందర్భంగా మిగిలినవారికంటే ముందుగా లక్ష్యాన్ని పూర్తి చేసే అవకాశాలు మరణించిన ఆ క్రీడాకారిణికే ఉండడం గమనార్హం.
కోల్కతాలోని హుగ్లీ నదిలో పది కిలోమీటర్ల లాంగ్ డిస్టెన్స్ ఇన్విటేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 30 మంది క్రీడాకారిణిలు పాల్గొనడం జరిగింది. ఈ ముపై మందిలో 23 ఏళ్ల షంపా దాస్ అనే క్రీడాకారిణి కూడా ఒకరు.
పోటీ ప్రారంభమై దాదాపు తొమ్మది కిలోమీటర్ల దూరం విజయవంతంగా పూర్తి చేసి ఫినిషింగ్ లైన్కు చేరువవుతున్న సమయంలో షంపా దాస్కు గుండె నొప్పి ప్రారంభమైంది. దీంతో ఆమె పోటీ మధ్యలోనే సృహ తప్పింది. ఈ హఠాత్పరిమాణంతో స్పందించిన నిర్వాహకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అయితే గుండె నొప్పి కారణంగా తేరుకోలేకపోయిన షంపా దాస్ ఆస్పత్రిలోనే మృతి చెందింది. ఈ పోటీల ప్రారంభ సమయంలో షంపా దాస్ ఆరోగ్యపరంగా ఫిట్గానే ఉన్నట్లు డాక్టర్లు నిర్థారించడం గమనార్హం.