పాకిస్థాన్లో ఈ ఏడాది నిర్వహించనున్న షూటింగ్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ స్వర్ణ విజేత బింద్రా పాల్గొనేలా చేయడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఒలింపిక్ చరిత్రలో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రా పాల్గొనడం ద్వారా ఛాంపియన్షిప్కు గుర్తింపు తేవాలని పాక్ ప్రయత్నిస్తోంది.
ఈ విషయమై పాకిస్థాన్ షూటింగ్ ఫెడరేషన్ (పీఎస్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రజీ అహ్మద్ మాట్లాడుతూ తాము నిర్వహించనున్న ఈ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనాల్సిందిగా బింద్రాను ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ఒకవేళ బింద్రా కనుక ఈ పోటీల్లో పాల్గొంటే పాకిస్థాన్లో క్రీడల అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే బింద్రా ఈ పోటీల్లో పాల్గొనడం వల్ల ఈ పోటీలపై అంచనాలు ఏర్పడి అభిమానుల్లో ఆసక్తి కూడా అధికమౌతుందని ఆయన అన్నారు. వచ్చే నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న ఈ ఛాంపియన్షిప్లో భారత్తో సహా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలకు చెందిన క్రీడాకారులు పాలుపంచుకుంటున్నాయి.