దేశవాళీ మెగా ఫుట్బాల్ టోర్నీ అయిన ఐలీగ్ శుక్రవారం ప్రారంభమైంది. కోల్కతాలోని బరాసత్ మైదానంలో ఈ ఐలీగ్ పోటీలు జరగనున్నాయి. దేశీయ ఫుట్బాల్ టోర్నీల్లో మెగా టోర్నీగా భావించే ఈ ఐలీగ్లో గెలుపొందిన విజేతకు రూ. 45 లక్షలు లభించడం విశేషం.
బరాసత్ మైదానంలో శుక్రవారం ప్రారంభమైన టోర్నీ ప్రారంభ మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు, చిరాగ్ యునైటెడ్ ఎస్సీ జట్టు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించింది. ఆట ప్రారంభమైన మొదటి 20 నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ సాధించి చిరాగ్ జట్టుపై ఒత్తిడి పెంచింది.
దీంతో ఆట ప్రధమార్థం ముగిసే సరికి ఈస్ట్ ఇండియా 3-0 ఆధిక్యం సాధించింది. ఇక ఆట రెండో అర్ధభాగంలో చిరాగ్ జట్టు ఓ గోల్ సాధించగల్గింది. అయితే మ్యాచ్ను మాత్రం 1-3 తేడాతో చిరాగ్ జట్టు కోల్పోయింది.
ఈస్ట్ బెంగాల్ జట్టు తరపున సుర్కుమార్, యూసుఫ్ యాకుట్, సునీల్ ఛత్రిలు ఒక్కో గోల్ సాధించారు. అదేసమయంలో చిరాగ్ జట్టు తరపున హర్దీవ్ సింగ్ సైనీ ఓ గోల్ సాధించాడు. ఈ టోర్నీ మొత్తం మీద 132 మ్యాచ్లు జరగనుండగా మొత్తం 12 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.