ఇటీవల ముగిసిన అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత హకీ జట్టు అటగాళ్ళ ప్రతిభ ఫర్వాలేదనిపించింది. ఈ పోటీల్లో మూడో స్థానం కోసం కొరియాను ఢీకొన్న భారత్ ఎట్టకేలకు విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలి అర్థభాగంలో గోల్స్ చేయలేక పోయిన ఆటగాళ్లు.. తర్వాత రెండో ఆటలో పుంజుకున్నారు.
ఈ విజయంలో భారత ఆటగాళ్లు ప్రదర్శించిన ప్రతిభ ముఖ్యంగా.. గోల్ కీపర్ భరత్ ఛత్రీదే ఆటతీరు ప్రశంసనీయంగా ఉంది. దీంతో అభిమానులు ఆలరించారు. ఈ మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు సర్దారా సింగ్, రోషన్ మిషన్, భరత్ చత్రీదేలు ఆటతీరు ప్రశంసనీయంగా ఉంది. ఈ విజయం పట్ల మాజీ హాకీ ఆటగాళ్లు కూడా ప్రశంసంచిన విషయం తెల్సిందే.