Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రముఖ రచయిత శోభా డేకు అమితాబ్ చెప్పుదెబ్బలాంటి సమాధానం!

ప్రముఖ రచయిత్రి శోభా డేకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు చెప్పుదెబ్బలాంటి ట్వీట్లతో సమాధానం ఇచ్చారు. రియో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల సింగిల్స్ విభాగం బ్యాడ్మింటన్ క్రీ

Advertiesment
PV Sindhu
, శుక్రవారం, 19 ఆగస్టు 2016 (16:32 IST)
ప్రముఖ రచయిత్రి శోభా డేకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు చెప్పుదెబ్బలాంటి ట్వీట్లతో సమాధానం ఇచ్చారు. రియో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల సింగిల్స్ విభాగం బ్యాడ్మింటన్ క్రీడలో అద్భుతంగా రాణిస్తున్న భారత క్రీడాకారిణి పీవీ సింధునుద్దేశించి శోభా డే ట్విట్టర్‌లో 'సిల్వర్ ప్రిన్సెస్' అంటూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లతో పాటు కోట్లాది మంది భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో శోభా డేకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, బాలీవుడ్ నటుడు బిగ్ బిలు తగిన రీతిలో కౌంటర్ ఇచ్చారు. శోభా డేను ఉద్దేశించి సెహ్వాగ్ చేసిన ట్వీట్‌లో శోభా అనే పదాలతో ఆడుకున్నాడు. 'సాక్షి మెడలో కాంస్య పతకం ఎంత శోభను ఇస్తోంది' అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేశారు. 'శోభా దే' రహాహై అన్నారు. అలాగే, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కూడా శోభా డే పట్ల చాలా కోపం వచ్చింది. అయితే ఆయన ఆమె పేరు ప్రస్తావించకుండానే తాను చెప్పదలచుకుంది చెప్పేశారు.
 
''మీరు ఖాళీ చేతులతో కాదు, మెడల్ తీసుకుని వస్తున్నారు.. మేం మీతో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటున్నాం'' అని పీవీ సింధును ఉద్దేశిస్తూ అమితాబ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు మీరు అతిగా వాగేవాళ్ల నోరు మూయించారని మరో ట్వీట్ చేశారు. పనులే మాట్లాడతాయని, అవి కూడా అప్పుడప్పుడు 'పెన్ను'ను ఓడిస్తాయని ఆయన అన్నారు. మనవాళ్లు సెల్ఫీలు తీసుకోడానికే అక్కడకు వెళ్తున్నారన్న రచయిత్రి శోభా కామెంట్లను గుర్తుచేస్తూ అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాడ్మింటన్ కోర్టులో 'చిరుత'లా సింధూ... రియో ఒలింపిక్స్ క్రీడల్లో నేటి టాప్ స్టార్... స్వర్ణం సొంతం కోసం