Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21వ శతాబ్దంలో వింబుల్డన్

Advertiesment
ఇతర ఆటలు
FileFILE
21వ శతాబ్ధంలోను ఇతర టోర్నీలపై వింబుల్డన్ తన ఆధిపత్యాన్ని యధావిథిగా కొనసాగించింది. భవిష్యత్‌లోను ఇదిలాగే కొనసాగేలా 1993లో దీర్ఘకాలిక ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. వీక్షకులు, ఆటగాళ్లు, అధికారుల కోసం అత్యంత నాణ్యత కలిగిన టెన్నిస్ టోర్నీగా అవతరించేందుకు వింబుల్డన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.

ఇందులో భాగంగానే కొత్త నిర్మాణాలు.. కొత్త కోర్టులను వృద్ధి చేసింది. అలాగే ఎక్కువ మంది వీక్షకులు కూర్చునేలా 728 సీట్లతో సెంటర్ కోర్టును నిర్మించింది. ఇలా అంచల వారీగా ప్రతి ఏడాది కొత్తదనంతో వింబుల్డన్ ముందుకు వస్తోంది.

కానీ ఈ ఏడాది లో మాత్రం టోర్నీ చరిత్రలోనే తొలి సారిగా వర్షం వచ్చిన ఆట ఆపకుండా ఉండే విధంగా సెంటర్ కోర్టు (రెయిన్ కంట్రోల్ సెంట్రల్ కోర్ట్)ను వింబుల్డన్ నిర్మించింది. ఇది వింబుల్డన్ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోనుంది. ఈ సెంటర్ కోర్టు నిర్మించిన సందర్భంగా 2009 మే, 17 ఆదివారం రోజున వింబుల్డన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఇందులో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను కూడా నిర్వహించింది.

వింబుల్డన్ ప్రైజ్‌మనీ

వింబుల్డన్ ప్రైజ్‌‍మనీ ఈ ఏడాది 6.2 శాతం మేర పెరిగింది. మొత్తం ప్రైజ్‌మనీ 12.55 మిలియన్ పౌండ్ల (18.38 మిలియన్ డాలర్లు)కు చేరుకుంది. గత ఏడాది ఈ టోర్నీ ప్రైజ్‌మనీ 11.8 మిలియన్ పౌండ్ల వద్దే ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 22న ప్రారంభమై, జులై 5న ముగియనుంది. గడిచిన ఏడాది కాలంలో డాలర్, పౌండు రెండింటి విలువ భారీగా పతనమైంది.

ఈ నేపథ్యంలో టోర్నీ ప్రతిష్టను కాపాడేందుకు ప్రైజ్‌మనీ పెంచాలని నిర్ణయించినట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ఛైర్మన్ టిమ్ ఫిలిప్స్ తెలిపారు. పురుషుల, మహిళల విభాగాల్లో ఛాంపియన్లగా నిలిచిన క్రీడాకారులకు చెరో 850000 పౌండ్లు అందించనున్నట్లు ఫిలిప్స్ తెలిపారు.

ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో టైటిల్ విజేతలకు ఒకే ప్రైజ్‌‍మనీ అందించే సాంప్రదాయాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తికావస్తోంది. గత ఏడాది టైటిల్ విజేతలకు 750000 పౌండ్ల ప్రైజ్‌మనీ అందించారు.

మరోవైపు ఆర్థిక సంక్షోభం ముదురుతున్న ఈ నేపథ్యంలో దీని ప్రభావం వింబుల్డన్ ఎదుర్కొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి తోడు ప్రైజ్‌మనీ పెంచడంతో పాటు, ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన వింబుల్డన్ టోర్నీ ప్రతిష్టకు, విశ్వసనీయతకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu