Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"శాఫ్ బాక్సింగ్"కు సురంజయ్ నేతృత్వం

Advertiesment
క్రీడలు
FILE
ఢాకాలో జరిగే దక్షిణాసియా క్రీడల్లో (శాఫ్) పాల్గొనే భారత బాక్సింగ్ బృందానికి సురంజయ్ సింగ్ నేతృత్వం వహించనున్నాడు. ఆసియా ఛాంపియన్ అయిన సురంజయ్ ఇంటర్ కాంటినెంటల్ ప్రెసిడెంట్స్ కప్‌లో బెస్ట్ బాక్సర్ అవార్డును కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలి ప్రెసిడెన్షియల్ కప్‌లో స్వర్ణం కేవసం చేసుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా కూడా చరిత్ర సృష్టించాడు.

సురంజయ్‌తో పాటు 57 కేజీల విభాగంలో జాతీయ ఛాంపియన్ చోటే లాల్ యాదవ్‌పై కూడా భారత్ ఆశలు పెట్టుకున్న శాఫ్ క్రీడలు జనవరి 29 నుంచి ఢాకాలో ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న వీజేందర్ సింగ్, అఖిల్ కుమార్‌లకు కామన్వెల్త్ క్రీడలను దృష్టిలో ఉంచుకుని ఈ టోర్నీ నుంచి విశ్రాంతి నిచ్చినట్లు భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) కార్యదర్శి పీకే మురళీధరన్ రాజా వెల్లడించారు.

కాగా.. భారత జట్టు తరపున 51 కేజీల విభాగంలో సురంజయ్ సింగ్, 48 కేజీల విభాగంలో అమన్‌దీప్, 57 కేజీల విభాగంలో చోటేలాల్ యాదవ్, 69 కేజీల విభాగంలో దిబాగ్ సింగ్, 75 కేజీల విభాగంలో కుల్దీప్ సింగ్, 91 కేజీల విభాగంలో మన్‌ప్రీత్, +91 కేజీల విభాగంలో ప్రవీణ్‌కుమార్‌లు పాల్గోనున్నారు. ఈ మేరకు భారతజట్టు పాటియాలా ప్రాక్టీస్ కూడా చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu