Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాంబే స్టాక్ మార్కెట్ : 65 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Advertiesment
Stock Market
, శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (18:10 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ 65 పాయింట్ల మేరకు లాభపడింది. వరుసగా రెండు రోజుల పాటు నష్టాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం మాత్రం లాభాల్లో ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 65 పాయింట్లు లాభపడి 27,061 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 8,106 వద్ద క్లోజ్ అయింది. 
 
ఈ ట్రేడింగ్‌లో సిప్లా, మారుతి సుజుకీ, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ లిమిటెడ్, సెసా గోవా తదితర షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. హిందాల్కో, సన్ ఫార్మా ఇండియా, టాటా పవర్, ఎన్ టీపీసీ, ఎల్ అండ్ టీ తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి. 

Share this Story:

Follow Webdunia telugu