Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

520 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్ సూచీ

Advertiesment
Sensex
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (17:46 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీ లాభాలతో ముగిసింది. శుక్రవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 520 పాయింట్ల మేరకు లాభపడి 27866 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 8,322 వద్ద స్థిరపడింది. 
 
జపాన్ బ్యాంక్ భారీ ఉద్దీపన కార్యక్రమాన్ని విస్తరించడంతో అదనపు విదేశీ పెట్టుబడులు వస్తాయన్న ఆశావహం, పలు కారణాలతో పలు సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. 
 
ఐడీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సన్, గెయిల్, టాటా పవర్, టాటా స్టీల్, బీపీసీఎల్, మారుతి సుజుకి తదితర సంస్థల షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. భారతీ ఎయిర్‌టెల్, జీ ఎంటర్ టైన్‌మెంట్స్ తదితర సంస్థల షేర్లు స్వల్ప నష్టాలు చవిచూశాయి. 

Share this Story:

Follow Webdunia telugu