Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

350 పాయింట్ల మేరకు నష్టపోయిన సెన్సెక్స్ సూచీ

Advertiesment
Sensex Falls Over 350 Points Amid Selloff in Global Markets
, గురువారం, 16 అక్టోబరు 2014 (16:53 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతోపాటు.. అనేక కారణాల రీత్యా సెన్సెక్స్ సూచీ ఏకంగా 350 పాయింట్ల మేరకు నష్టపోయి 25,999 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయి 7,748 వద్ద స్థిరపడింది. 
 
కాగా, ఈ ట్రేడింగ్‌లో ఐటీసీ లిమిటెడ్, కోల్ ఇండియా, గెయిల్, సిప్లా తదితర షేర్లు స్వల్ప లాభాలను అర్జించగా, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, సెసా గోవా, టాటా స్టీల్, టాటాపవర్ తదితర షేర్లు భారీ నష్టాలు నమోదు చేసుకున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu