Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఖరి గంటలో నిఫ్టీ, సెన్సెక్ చురుగ్గా కోలుకున్నాయి

ఆఖరి గంటలో నిఫ్టీ, సెన్సెక్ చురుగ్గా కోలుకున్నాయి
, శుక్రవారం, 15 మే 2020 (22:08 IST)
ఎస్&పి బిఎస్ఇ సెన్సెక్స్ మరియు నిఫ్టీ-50 సూచీలు ఈ రోజున ట్రేడింగ్ సెషన్ చివరి సమయంలో సమంగా నిలిచాయి. వేదాంత, ఆర్‌ఐఎల్, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి స్టాక్‌ల మద్దతుతో కోలుకోవడం జరిగింది. బ్యాంకింగ్ రంగం యొక్క బలహీనమైన పనితీరు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ మరియు నిఫ్టీ, రేండు సూచికలపై భారాన్ని కొనసాగించింది. సెన్సెక్స్ 25.16 పాయింట్లు లేదా 0.081% క్షీణించి 31,122.89 పాయింట్లతో ముగియగా, నిఫ్టీ 5.90 పాయింట్లు లేదా 0.065% క్షీణించి 9,136.85 పాయింట్ల వద్ద ముగిసింది.
 
బుధవారం సాయంత్రం, ప్రభుత్వం ప్రకటించిన రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ వివరాలను పెట్టుబడిదారులు తెలుసుకున్న తరువాత ఇది భారతదేశంలో స్టాక్ మార్కెట్ల ప్రతికూల పరంపరలో వరుసగా రెండవ రోజుగా మిగిలింది. నిఫ్టీ, ఎఫ్ ఎం సిజి, నిఫ్టీ మెటల్, మరియు నిఫ్టీ ఎనర్జీని మినగాయింది, ఎన్‌ఎస్‌ఇలోని అన్ని రంగాల సూచికలు ఎరుపు రంగులోనే ముగిసాయి.
 
వాణిజ్య మార్కెట్‌ను ప్రేరేపించిన లోహాలు
లోహ, ఎనర్జీ రంగాలు ఎస్ అండ్ పి 500 సూచికలో మెరుగ్గా ఉండగా, మరికొన్ని ఎరుపు రంగులో ముగిసాయి. టాటా స్టీల్ మరియు వేదాంతల గణనీయమైన లాభాలు మెటల్-స్టాక్స్ నిలకడకు దారితీశాయి. టాటా స్టీల్ లిమిటెడ్ 4.60 లేదా 1.71% పెరిగి, రూ. 273.15 వద్ద ముగిసింది, వేదాంత లిమిటెడ్ రూ. 3.45 లేదా 3.87% పెరిగి రూ. 92.60 వద్ద ముగిసింది.
 
క్షీణించిన పెట్రోలియం & ఎనర్జీ విభాగాలు
రోజు కనిష్ట ధర రూ. 311.10 వద్ద ప్రారంభమైన తరువాత, భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆయిల్ & గ్యాస్ కంపెనీ - భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ లాభాలతో రూ. 8.10 లేదా 2.62% ఎగబాకి, రూ. 317.80 వద్ద ముగిసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా గణనీయమైన లాభాలను ఆర్జించింది మరియు రూ .0.35 లేదా 0.47% పెరిగి రూ. 75.50 వద్ద ముగిసింది.
 
లాభాలు ఆర్జించిన ఆటోమొబైల్ రంగం
నిఫ్టీ ఆటో ఈరోజు ప్రతికూలంగా ముగిసినప్పటికీ, ఈవారం చివరి ట్రేడింగ్ సెషన్లో దాని లిస్టెడ్ షేర్లు చాలా వరకు ఎరుపు రంగులో ముగిశాయి, అయినా, బాష్ లిమిటెడ్ షేర్ ధర 1.09% లాభం నమోదు చేసి 9,620 రూపాయలకు చేరుకుంది. నిఫ్టీ ఆటో 58.35 పాయింట్లు లేదా 1.01% క్షీణించి, 5745.70 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో, అపోలో హాస్పిటల్స్ సూచికలపై గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. ఈ స్టాక్ ఒక రోజు కనిష్టానికి రూ. 1290.16 ప్రారంభమైంది, కానీ త్వరగానే రూ. 1,3,54.55 కు చేరుకుంది, ఇది రూ .60.15 లేదా 4.65% లాభాలను నమోదు చేసింది.
 
పెట్టుబడిదారులను చికాకు పెట్టిన ఐ.టి
కరోనావైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా యుఎస్ ప్రధాన కార్యాలయం గార్ట్నర్ ఇంక్ (గ్లోబల్ రీసెర్చ్ & అడ్వైజరీ) సంస్థ ఈ రంగంలో 8% కుంచించుకు పోతుందని ఊహించిన తరువాత ఐటి స్టాక్స్ తీవ్ర భయాందోళనలకు గురయ్యాయి. ఎన్‌ఎస్‌ఇ ఐటి ఇండెక్స్ 0.73% లేదా 97.35 పాయింట్లు తగ్గి, శుక్రవారం ట్రేడింగ్‌తో పోలిస్తే 13,196.35 పాయింట్ల వద్ద ముగిసింది. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ. 5.25 లేదా 1.01% తగ్గి, రూ. 512,20వద్ద ముగిసింది.
-అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం