దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ను గురువారం సాయంత్రం 6.15 నిమిషాలకు ప్రారంభమైంది. ఈ ట్రేడింగ్లో సెన్సెక్స్ సూచీ పరుగులు పెట్టింది. ఉత్తర భారతంలో వ్యాపార వర్గాలు ప్రతియేటా దీపావళి కొత్త ఖాతలు తెరుస్తాయి. యేడాది లెక్కలన్నీ దీపావళితో ముగుస్తాయి.
అందువల్ల దేశీయ స్టార్ మార్కెట్లో దీపావళి ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్కు ప్రాధాన్యం ఉంది. గురువారం ప్రత్యేక ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లు జోరుమీద ఉన్నాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ నెలకొన్న అనుకూల వాతావరణంలో మార్కెట్లు కళకళలాడాయి.