Publish Date: Mon, 30 Jun 2014 (17:39 IST)
Updated Date: Mon, 30 Jun 2014 (17:41 IST)
బాంబే స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 314 పాయింట్ల మేరకు లాభపడింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 25414 వద్ద ముగియగా, నిఫ్టీ 103 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 7611 వద్ద స్థిరపడింది.
ఈ ట్రేడింగ్లో సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, సీఈఎస్ఈ, జేపీ పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, యునైటెడ్ స్పిరిట్స్, శోభా డెవలపర్స్, భారతీ ఇన్ఫ్రా టెల్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్, భూషణ్ స్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.