వార్త: తెలంగాణ ఆత్మగౌరవ రథయాత్రను రంగారెడ్డి జిల్లా, వికారాబాద్లో ప్రారంభించిన దేవేందర్ గౌడ్ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం తెలంగాణా ప్రజలు యాభై ఏళ్లుగా సాగిస్తున్న పోరాటానికి ముగింపు తీసుకురావడమే తమ ఉద్యమం ఉద్ధేశ్యమన్నారు.
చెవాకు: అంతేనంటారా? యాభై ఏళ్లుగా సాగిస్తున్న వారి పోరాటం ఏడాది క్రితం వరకు కూడా మీకు కన్పించలేకపోయింది. నిజంగానే ఉద్యమాన్ని మీరు ప్రజలకోసమే నెత్తికెక్కించుకుంటున్నారా లేక మీ రాజకీయ భవిష్యత్ కోసం చేస్తున్నారా?
ఉద్యమమే మీకు ముఖ్యమైతే ఇప్పటికే అదే ఉద్యమం దిశగా పయనిస్తున్న వారందరితో చర్చలు జరిపి వారిని కూడా కలుపుకుని పోయేవారుగా. లేక మీరే పెద్దన్నయ్య పాత్ర పోషించాలనుకుంటున్నందున వారే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారేమో!
ఏకాభిప్రాయం కలిగిన నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే చాలా ఉద్యమాలు ఇలా నీరుగారిపోతున్నాయనే విషయం మీకు తెలియదా. కాంగ్రెస్ను ఓడిస్తే కానీ తెలంగాణా రాదని మీరు అంటున్నారు. అదే మాట ఇతరులు అంటున్నారు. కానీ మీరు మాత్రం దానికోసం ఏకం కారు. ఇలాగైతే ఎలా?