Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యప్రదేశ్‌లో ఖజురహో నాట్యోత్సవం

మధ్యప్రదేశ్‌లో ఖజురహో నాట్యోత్సవం
మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ సంప్రదాయమైన ఖజురహో నాట్య ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసింది. 10వ శతాబ్దంలోని చందెళ్ల సామ్రాజ్యంలో నాటి రాజులు నిర్మించిన చిత్రగుప్త ఆలయం, విశ్వనాథ ఆలయాల ముందు ఈ నాట్యాలు ప్రదర్శితం కానున్నాయి.

ఇటీవల కాలంలో ఖజురహో నాట్యోత్సవాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే... రమణీయ ఖజురహో శిల్ప సంపద నడుమ ఈ నాట్య ప్రదర్శనలను ఇవ్వడం. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాలను దేదీప్యమానమైన వెలుగులు విరజిమ్మే లైట్లతో అలంకరించారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తింపును తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. జీవితాలకు దర్పణం లాంటిది ఖజురహో. అంతేకాదు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక.

దీనిని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ ఖజురహో నాట్యోత్సవాలను ఏర్పాటు చేస్తున్నాం. దీనిని అంతర్జాతీయ దినోత్సవం గుర్తించాలని అడుగుతున్నాం. ఈ ఎన్నికలు అయిన తర్వాత ఈ విషయంపై కేంద్రాన్ని అడుగుతాం" అని అన్నారు.

ఖజురహో నాట్యోత్సవాలలో కథక్, ఒడిస్సీ, కథాకళి, భరతనాట్యం, కూచిపూడి, మణిపురి నాట్య రీతులను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని 1975లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. నాటి నుంచి క్రమంగా ఈ ఉత్సవాలు అందరి మన్ననలూ పొందుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu