Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రిస్సూర్ పండుగలో గజరాజుల వైభవం

త్రిస్సూర్ పండుగలో గజరాజుల వైభవం
, గురువారం, 17 ఏప్రియల్ 2008 (16:54 IST)
WD
గజరాజులు కొలువుదీరి కనువిందు చేసే ఏకైక ప్రదేశం కేరళలోని త్రిస్సూర్ అని చెబితే అతిశయోక్తి కాదు. ఇటీవల కేరళ నూతన సంవత్సరం మేదమ్ సందర్భంగా ఏనుగుల ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా పురమ్ పేరన కేరళ ప్రజలు జరుపుకునే ఈ పండుగనాడు ఏనుగులకు అందమైన అలంకరణలు చేశారు.

మలయాళీ నూతన సంవత్సరం మేదమ్ నాడు వడక్కునాధన్ ఆలయం వెలుపల నిర్వహించే పూరమ్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ఏనుగులను అందంగా అలంకరించి మేళతాళాలతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం తొలి సంధ్య వేళల్లో ప్రారంభమై మరుసటి రోజువరకూ సాగుతుంది.

ప్రతి గ్రూపులోనూ కనీసం పదిహేనుదాకా ఏనుగులు ఉంటాయి. ప్రతి గ్రూపు తమతమ ఏనుగుల ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తారు. మొత్తం మీద అత్యంత వైభవంగా ఈ ఉత్సవం జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్న కేరళ ప్రజలు తమ తమ పండుగలలో ఏనుగుల ప్రదర్శనకు తావు లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ నిర్వహించరంటే నమ్మి తీరాల్సిందే మరి.

Share this Story:

Follow Webdunia telugu