Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల- రూ.10వేలు ఇస్తే.. ఇక శ్రీవారి బ్రేక్ దర్శనం

Advertiesment
VIP darshan
, మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో దళారులకు అడ్డుకట్ట వేసే దిశగా కొత్త దర్శనానికి నాంది పలికారు.. టీటీడీ అధికారులు. ఇప్పటికే ఎల్-1, ఎల్-2, ఎల్-3 దర్శనాలను రద్దు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇకపై దాతల నుంచి విరాళాలు తీసుకుని, వారికి ముఖ్యమైన సేవా టికెట్లను అందించాలని నిర్ణయించింది. 
 
ఇందులో భాగంగా, శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించిన టీటీడీ, రూ.10 వేల విరాళం ఇచ్చే భక్తులకు స్వామి సమక్షంలో తీర్థం, శఠారిలతో కూడిన బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పించనుంది. అంతకుమించి విరాళాలు ఇస్తే, ముఖ్యమైన వస్త్రాలంకార, తోమాల, అర్చన వంటి సేవా టికెట్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించాకు. 
 
ఇందులో భాగంగా తొలి దశలో రోజుకు 200 టికెట్లను విడుదల చేస్తూ, ప్రయోగాత్మకంగా పరిశీలించాలని, ఆపై భక్తుల ఆదరణను బట్టి, రోజుకు 1000 టికెట్ల వరకూ కేటాయించాలని భావిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో రోజుకు కనీసం కోటి రూపాయల చొప్పున ఏడాదిలో రూ. 360 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-08-2019 మంగళవారం మీ రాశిఫలాలు - అపరిచిత వ్యక్తులపట్ల...