Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో మోస్తారు రద్దీ.. ఐదు గంటల్లోనే శ్రీవారి దర్శనం

తిరుమలలో మోస్తారు రద్దీ.. ఐదు గంటల్లోనే శ్రీవారి దర్శనం
, సోమవారం, 9 మే 2016 (11:15 IST)
తిరుమలలో మోస్తారు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్న భక్తులకు దర్శనం కాకపోవడంతో కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సోమవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.
 
కాగా, కాలినడక భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని అతిథి గృహాల గదులు సులభంగానే లభిస్తున్నాయి. మరోవైపు ఆదివారం శ్రీవారిని 81,417 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.7 కోట్ల మేరకు వసూలైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 11న కోదండరామాలయంలో పుష్పయాగం