Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో మోస్తారు రద్దీ.. ఐదు గంటల్లోనే శ్రీవారి దర్శనం

Advertiesment
tirumala pilgrims crowd
తిరుమలలో మోస్తారు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్న భక్తులకు దర్శనం కాకపోవడంతో కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సోమవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.
 
కాగా, కాలినడక భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని అతిథి గృహాల గదులు సులభంగానే లభిస్తున్నాయి. మరోవైపు ఆదివారం శ్రీవారిని 81,417 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.7 కోట్ల మేరకు వసూలైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 11న కోదండరామాలయంలో పుష్పయాగం