Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Advertiesment
Sri Venkateswara Swamy Varshika Brahmotsavam
, శనివారం, 7 మే 2016 (17:41 IST)
తితిదే అనుబంధంగా ఉన్న న్యూడిల్లీలోని గోల్‌ మార్కెట్‌ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మే 19వ తేదీ నుంచి 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ధార్మిక సంస్థ సిద్ధమైంది. మే 18వ తేదీన అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
 
బ్రహ్మోత్సవాల్లో బాగంగా మే 15వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 19వ తేదీన ఉదయం 9 గంటల 29 నిమిషాలకు మిథున లగ్నంలో ధ్వజారోహణం ఘనంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. 
 
19వ తేదీ ధ్వజారోహణం, 20వ తేదీ చిన్నశేషవాహనం, 21వ తేదీ సింహవాహనం, 22వ తేదీ కల్పవృక్షవాహనం, 23వ తేదీ పల్లకీ ఉత్సవం, 24వ తేదీ హనుమంత వాహనం, 25వ తేదీ సూర్యప్రభవాహనం, 26వ తేదీ రథోత్సవం, 27వ తేదీ చక్రస్నానం వాహనాలను తితిదే ఊరేగించనుంది. 
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 23వ తేదీన పుష్పయాగంను కూడా తితిదే నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కళ్యాణోత్సవం, మే 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పుష్పయాగాన్ని జరుపనున్నారు. అలాగే సాయంత్రం వూంజల్‌ సేవను కూడా తితిదే నిర్వహించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధర్మప్రచారానికి వారధిగా శుభప్రదం బోధకులు నిలవాలి : తితిదే ఈఓ సాంబశివరావు