శ్రీకాళహస్తిలో వైభవోపేతంగా ఏడుగంగమ్మల జాతర...
సమస్త లోకాలను పాలించే చల్లని తల్లి.. భక్తుల కోర్కెలను అనుగ్రహించే కల్పవల్లి..అనంత ప్రాణకోటిని రక్షించే దయా స్వరూపిణి. గంగమ్మ జాతర వేడుకలతో జంగమయ్య క్షేత్రమైన శ్రీకాళహస్తి పులకించిపోయింది. సప్తగంగల సంగమ వైభవాన్ని చాటుతూ జరిగిన ఏడుగంగల జాతర ప్రాభవాన్ని
సమస్త లోకాలను పాలించే చల్లని తల్లి.. భక్తుల కోర్కెలను అనుగ్రహించే కల్పవల్లి..అనంత ప్రాణకోటిని రక్షించే దయా స్వరూపిణి. గంగమ్మ జాతర వేడుకలతో జంగమయ్య క్షేత్రమైన శ్రీకాళహస్తి పులకించిపోయింది. సప్తగంగల సంగమ వైభవాన్ని చాటుతూ జరిగిన ఏడుగంగల జాతర ప్రాభవాన్ని చూఇస తరిచేందుకు అశేష జనవాహినితో శ్రీకాళహస్తి భక్తజనసంద్రమైంది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. ఈ పేరు వినగానే ఎప్పుడూ శివనామస్మరణలు వినిపిస్తాయి. అలాంటిది..జాతర కావడంతో శక్తి స్వరూపిణి గంగమ్మ నామస్మరణలతో ముక్కంటి క్షేత్రం మారుమ్రోగింది. పురాణాల ప్రకారం గతంలో జమీందార్లు శ్రీకాళహస్తిని పాలించే సమయంలో అప్పట్లో గ్రామంగా పిలిచే శ్రీకాళహస్తిలో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జమీందార్లు ఏడు రాళ్లను పెట్టి ఏడుగంగమ్మలుగా పూజించారు. వెంటనే గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా మారిపోయారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఆచారంగా ఏడుగంగమ్మల జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. జాతరలో భాగంగా రెండురోజుల పాటు శ్రీకాళహస్తిలోని వీధులపై ఏడు గంగమ్మలను ఉంచి పూజలు నిర్వహించారు. పెళ్లి మండపం వద్ద పొన్నాలమ్మ, గాంధీవీదిలో కొలువు దీరిన అంకమ్మ, కొత్త పేట వద్ద భువనేశ్వరి, బ్రాహ్మణవీధిలో నల్లగంమ్మ, సంత మైదానంలో మూలస్థాన ఎల్లమ్మ, బేరి వారి మండపం వద్ద ముత్యాలమ్మ, సన్నిధి వీధిలో అంకాళమ్మ వేషధారణలతో అమ్మవార్లు భక్తులకు దర్సనమిచ్చారు. వేలాదిమంది భక్తులు జాతరలో పాల్గొని మ్రొక్కులు తీర్చుకున్నారు.
శ్రీకాళహస్తి ఏడు గంగల జాతరకు భారీ బందోబస్తునే పోలీసులు ఏర్పాటు చేశారు. వేలాదిమంది భక్తులు వచ్చిన జాతరలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా వ్యవహరించారు పోలీసులు.