Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిదంబరం తిరుమలలో ఏం చేశారో తెలుసా...?!

చిదంబరం.. సాధారణంగా ఒక్కో రంగంలో ఒక్కో ప్రముఖుడు ఉంటాడు. ఈ చిదంబరం ఎవరో.. తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఏం చేశారో కన్ఫ్యూజన్‌గా ఉంది కదూ. అయితే దీన్ని చదవండి. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో పార్టీకే పెద్ద దిక్కుగా ఉండి, కీలక ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న చిదంబరం

చిదంబరం తిరుమలలో ఏం చేశారో తెలుసా...?!
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (20:34 IST)
చిదంబరం.. సాధారణంగా ఒక్కో రంగంలో ఒక్కో ప్రముఖుడు ఉంటాడు. ఈ చిదంబరం ఎవరో.. తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఏం చేశారో కన్ఫ్యూజన్‌గా ఉంది కదూ. అయితే దీన్ని చదవండి. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో పార్టీకే పెద్ద దిక్కుగా ఉండి, కీలక ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న చిదంబరం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. దేశంలో ఘోరంగా కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిన చాలాకాలం తరువాత చిదంబరం తిరుమలకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
సాధారణ భక్తుడిలా వచ్చిన చిదంబరం ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనుగోలు చేశారు. సుపథం మార్గం నుంచి ఆలయంలోకి చేరుకున్న చిదంబరం కుటుంబ సభ్యులు మహాలఘు దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. సాధారణంగా మాజీ కేంద్రమంత్రికి తితిదే సపర్యలు చేసి ప్రత్యేక దర్శనభాగ్యం చేసే అవకాశం ఉంది. అయితే చిదంబరం ముబావంగా, ఎవరితో మాట్లాడకుండా ఎంత నిశ్శబ్దంగా వచ్చారో.. అదేవిధంగా తిరిగి వెళ్ళిపోయారు. చిదంబరంను చూసిన తితిదే అధికారులు ఆయన్ను ప్రత్యేకంగా తీసుకెళ్ళాలని చూసినా ఆయన వారిని సున్నితంగా తిరస్కరించారు. ఆలయం వెలుపల కూడా మీడియాతో మాట్లాడకుండానే చిదంబరం వెళ్ళిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ఏకాంత ఆరగింపు... యేడాదికి రూ.36 లక్షలు స్వాహా...?