Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముట్టంలోని సెయింట్ మేరీస్ చర్చి

Advertiesment
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఏసుక్రీస్తును
WD PhotoWD
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఏసుక్రీస్తును, మరియమాతను తమ ఇష్టదైవాలుగా భావించి కొలుస్తున్నారు. అయితే.. క్రిస్తు పుట్టిన రోజైన క్రిస్మస్‌ను పురస్కరించుకుని కేరళ రాష్ట్రంలోని చారిత్రాత్మక అమల ఉద్భవ మాత (తల్లి కన్నెమేరి) చర్చి ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం ఈ వారం తీర్థయాత్రలో. క్రిస్మస్ పండుగ సందర్భంగా.. ఏసుక్రీస్తును, ఆయన తల్లి మరియమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పరిశుద్ధ దేవతామాతగా, ఏసుతల్లిగా మరియమ్మను.. వారిని ప్రార్థించే మిలియన్ల క్రైస్తవ సోదరులకు తల్లిగా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దేవుని కృపను పొందేందుకు మరియమ్మను ప్రార్థిస్తుంటారు. కన్యమేరి దేవునిబిడ్డ ఏసుక్రీస్తు తల్లి అనే విషయం ప్రతిఒక్కరికి తెలిసిన విషయం తెల్సిందే. గత 1854 సంవత్సరంలో తొమ్మిదో పోప్ పైస్ IX.... మేరిమాత జన్మపాపం లేకుండా గర్భందాల్చిందని, ఈ నిజాన్ని క్రైస్తవులు సంపూర్ణ మనస్సుతో అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. కన్యమేరి పరిశుద్ధురాలనే విషయం నాలుగో శతాబ్దికి చెందిన సెయింట్ అప్రామ్ రాసిన 'నిషిబియన్' అనే కవితా
webdunia
WD PhotoWD
సంపుటిలో పేర్కొన్నారు.

కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళ జిల్లా సెయింట్ మేరీస్ ఫొరెన్నా చర్చి వెలసివుంది. ఈ ప్రాంతానికి కేరళ రాష్ట్ర ప్రజలతో పాటు.. దేశం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని వెళుతుంటారు. ఇక్కడకు కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే కాకుండా.. అన్ని మతాల వారు వచ్చి మాతను ప్రార్థిస్తుంటారు. అయితే.. ఇక్కడ ప్రార్ధనలు చేసే భక్తులు సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థనలు చేస్తే.. తమ కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం ఉంది. తమ వ్యాపారాలు, నూతన గృహప్రవేశాలు, కొత్త కోర్సులు, ఇలా.. ఏదైనా కావచ్చు వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని వారి విశ్వాసం.

webdunia
WD PhotoWD
అంతేకాకుండా చిక్కులతో సతమతమయ్యే సమయంలో ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తే వారి మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందని భక్తులు అంటుంటారు. తమకు లభించే సుఖసంతోషాలకు మేరిమాత వారధిగా ఉంటూ.. వారి కోర్కెలు తీర్చుతుందని పేర్కొంటారు. ఈ చర్చిలో ఉన్న గుమ్మటం (మద్భా ఆఫ్ ది చర్చ్) పోర్చుగీసు భవన నిర్మాణ కళతో నిర్మించారు. ఈ పీఠంపై నిర్మితమై ఉన్న అమ్మవారి విగ్రవం గత రెండు శతాబ్దాల క్రితం ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించినట్టు చరిత్ర చెపుతోంది.

ఇంత చారిత్రక ప్రసిద్ధిగాంచిన ముట్టం సెయింట్ మేరీస్ ఫోరెనా చర్చికు 900 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చర్చి కేంద్రీకృతమైన అళపుళా జిల్లాలోని చెర్తలా పట్టణం ఒక చిన్నపాటి వాణిజ్య కేంద్రంగా ఉందన్నారు. ఆరంభకాలంలో యూదు మతస్తులు ఇక్కడ నుంచి తమ వాణిజ్యం కార్యకలాపాలు కొనసాగించారు. ఏసుక్రీస్తుకు ఉన్న 12 మంది భక్తులలో ఒకరైన ధర్మదూత థామస్ ఇక్కడకు వచ్చినపుడు కొక్కమంగళం అనే ప్రాంతంలో బసచేసినట్టు చరిత్ర పేర్కొంటోంది. ఆయన కేరళ
webdunia
WD PhotoWD
రాష్ట్రంలోని నెలకొల్పిన ఏడు చర్చిల్లో ఇదొకటిగా చెపుతారు.

ఆ తర్వాత కొద్దికాలానికి బాగా ప్రసిద్ధి చెందిన క్రైస్తవులు ముట్టం అనే ప్రాంతంలో మరో కొత్త చర్చిని 1023 సంవత్సరంలో నిర్మించారు. ఆ చర్చిలో పవిత్రమైన దేవమాతను ప్రతిష్టించి, ప్రత్యేక ప్రార్థనలతో కొలుస్తూ వస్తున్నారు. కన్యమాత పవిత్రతను తెలియజేసే విధంగా.. ప్రతి ఏడాది డిసెంబరు ఎనిమిదో తేదీన ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను 1476 సంవత్సరంలో పోప్ సిటస్-IV ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఈ ఉత్సవాలు క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

webdunia
WD PhotoWD
ముట్టంలో ఉన్న ఈ పవిత్ర చర్చిలో ఏడాదికి రెండు సార్లు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతుంటారు. కన్నెమాత ఉత్సవాలు డిసెంబరు ఎనిమిదో తేదీ తర్వాత వచ్చే తొలి ఆదివారం, ఆతర్వాత జనవరి నెల 21వ తేదీన నిర్వహిస్తారు. ఈ రెండు ఉత్సవాల్లో కన్నెమాత, జీసస్ క్రిస్ట్ విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ చర్చిలో ఉన్న గుమ్మటాన్ని ఆధునకకీకరించి, గత 16వ శతాబ్ధిలో పుణ్యస్థలంగా నిర్మించారు. ముఖ్యంగా.. ఈ చర్చి ఆకారం, నిర్మాణం పోర్చుగీసు భవన నిర్మాణ కళను పోలివుంటుందని, సెయింట్ జేవియర్ ఫ్రాన్సిస్ గోవా నుంచి కేరళకు వచ్చినపుడు ఈ పుణ్యస్థలంలో బసచేసినట్టు చెపుతున్నారు.

ఆ సమయంలే జేవియర్ అనారోగ్యంపాలైన ఒక చిన్నారికి ప్రాణం పోసినట్టు భక్తుల విశ్వాసం. ఈ చర్చి దక్షిణ భాగంలో ఆ శిలువను ఏర్పాటు చేశారు. సెయింట్ మేరిస్ అంటే.. పుణ్యలోకానికి రక్షకురాలు అని నానుడి ఉంది. సెయింట్ మేరిస్.. ఇక్కడకు వచ్చే పిల్లలు, పెద్దలు సుఖసంతోషాలతో అనందమయంగా జీవనం గడిపేలా దీవెనలు/ఆశీర్వాదాలు ఇస్తుందని పేర్కొంటారు. ఇలా..ముట్టంలోని సెయింట్ మేరిస్ చర్చి అందరి ప్రశంసలు అందుకోంటోంది.

Share this Story:

Follow Webdunia telugu