Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పద్దెనిమిది చేతుల "మహాలక్ష్మీ శ్రీ కాళీమాత"

Advertiesment
శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం. ఈ దేవాలయం త్రిశక్తి పీఠమని

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

, సోమవారం, 3 డిశెంబరు 2007 (14:21 IST)
WD PhotoWD
శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం. ఈ దేవాలయం త్రిశక్తి పీఠమని పిలవబడుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానది తీరంలోని విజయవాడలో నెలకొన్న ఈ పీఠం, ఆధునిక కాలంలోని అరుదైన దేవాలయంగా భక్తుల పూజలను అందుకుంటున్నది. త్రిశక్తి పీఠంలో శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి విగ్రహాలు నెలకొల్పబడి ఉన్నాయి. "ఇచ్ఛాశక్తి", "క్రియాశక్తి" మరియు "జ్ఞానశక్తి"కి ఈ పవిత్రమైన విగ్రహాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. దేశంలోని "అష్ఠాదశ పీఠాల"కు గల పవిత్రతను ఈ పీఠం కలిగి ఉన్నది.

స్థలపురాణం: నెల్లూరుకు సమీపంలో గల అరణ్యంలో స్వయంభూవుగా అవతరించిన శ్రీమహాకాళి విగ్రహాన్ని మిలటరీ ఇంజనీర్ ఒకరు విజయవాడకు తీసుకువచ్చారు. పవిత్ర కృష్ణానదీ తీరంలో 1947 అక్టోబర్ 14వతేదీన శక్తిఉపాసకులైన గుంజా రామస్వామి శ్రీమహాకాళి విగ్రహాన్ని ప్రతిష్టించారు. చిన్నపాటి
webdunia
WD PhotoWD
దేవాలయంలో 11 సంవత్సరాలు పాటు మహా పూజను నిర్వహించిన ఆయన "కాళిదాసు"గా ప్రసిద్ధులైనారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనూహ్యమైన పరిస్థితులలో ఆ దేవాలయం మూతపడింది. దాదాపు 15 సంవత్సరాల తరువాత అనగా 1965 సంవత్సరంలో మరో భక్తుడు తురగా వెంకటేశ్వర్లు దేవాలయ తలుపులను తెరిచారు. ఆయనతోపాటు వచ్చిన వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ దేవాలయంలో వెలుగుతున్న "జ్యోతి" దర్శనమిచ్చింది. శ్రీమహాకాళి శక్తి వారి కన్నుల ఎదుట ఆ విధంగా ప్రదర్శితమైంది.

webdunia
WD PhotoWD
"పంచామృత స్థాపన", "శ్రీలక్ష్మీగణపతి హోమం" మరియు "లక్ష కుంకుమార్చన" అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ నిత్యపూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భక్త జనులకు ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తూ శరన్నవరాత్రి, దీపావళి, తదితర ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి.

దశముఖ మహాకాళి:
ఇక్కడి మహాకాళి పది ముఖాలు, పది పాదములను కలిగి గాఢమైన నీలివర్ణంలో దర్శనమిస్తుంది. ఆభరణ శోభితమై అలరారుతున్న అమ్మవారి అష్ట హస్తాలలో పలు రకములైన ఆయుధాలు, ఆభరణాలు కనిపిస్తాయి. ఖడ్గం, చక్రం, గద, విల్లు, బాణం, ఇనుప ఆయుధం, పొడవైన ఈటె, వడిసెల, శంఖం, మానవ శిరస్సులను మహాకాళి తన హస్తాలలో ధరించి కనిపించింది. తామస గుణానికి తార్కాణమైన దేవి, శ్రీమహావిష్ణువుకు యోగనిద్రను కలిగించింది. శ్రీమహావిష్ణువును విడువమని బ్రహ్మ దేవుడు వేడుకొనడంతో శ్రీ మహావిష్ణువు మధుకైటభులను సంహరించాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పద్దెనిమిది చేతుల మహాలక్ష్మి:
రాజసిక తత్వంలో ద్వితీయ శక్తిగా మహాలక్ష్మి రాక్షసులను సంహరించేందుకు పగడాన్ని పోలిన ఎరుపు వర్ణాన్ని సంతరించుకున్నది. ఆమె తన 18 హస్తములలో
webdunia
WD PhotoWD
జపమాల, సమర గొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం, తామర పువ్వు, విల్లు, నీటి కుండ, దుడ్డు కర్ర, పొడవైన ఈటె, ఖడ్గం, కవచం, శంఖం, గంట, జల పాత్ర, త్రిశూలము, ఉరి త్రాడు మరియు సుదర్శన చక్రధారియై భక్తులకు వరదాయినిగా నిలుస్తున్నది.

webdunia
WD PhotoWD
దేవతలందరి శక్తి నుంచి ఉద్భవించిన శక్తిస్వరూపిణి, ఆహార్యంలో శక్తులను కనపరిచే మాత గానే కాక దుష్టశక్తులతో పోరాడే మహాలక్ష్మిగా సర్వలోకాలకు రక్షించే అభయమిస్తున్నది. కనుకనే ఆమె రుధిర వర్ణం మరియు సమర వర్ణమైన ఎరుపు రంగులో దర్శనమిస్తున్నది. మహిషాసురుని సంహరించిన మహాలక్ష్మి, మహిషాసుర మర్ధినిగా "శక్తి ఉపాసకుల"చే కొలవబడుతున్నది.

ఎనిమిది చేతుల సరస్వతి:
దేవి యొక్క స్వాతిక లక్షణాలకు ప్రతీకగా మూడవ దేవత అయిన మహా సరస్వతి నిలుస్తున్నది. శరత్కాలపు చంద్రుని పోలిన ఆమె తన ఎనిమిది చేతులలో గంట, త్రిశూలము, నాగలి, శంఖం, ముసలం, చక్రం, విల్లు, బాణాలను ధరించి భక్తజనులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడిస్తున్నది. భౌతిక పరిపూర్ణతకు, సౌందర్యానికి సరస్వతీ మాత తార్కాణంగా నిలుస్తున్నది. కార్య విధానం మరియు నిర్వహణకు తోడ్పాటునందించే శక్తిగా ఆమె పూజలందుకుంటున్నది.

ధూమ్రలోచన, చండ, ముండ, నిశుంభ, సుంబాసురులను లోకకళ్యాణార్థం మహా సరస్వతి సంహరించింది. ముగ్గురు మూర్తులకు మూల శక్తిగా "మహేశ్వరి లేదా "రాజరాజేశ్వరి" మరియు దక్షిణ భారతదేశాన శక్తి ఉపాసకులు కొలిచే "లలితా త్రిపుర సుందరి" భాసిస్తున్నది. లలితను సౌందర్యానికి అదిదేవతగా భక్తులు ఆరాధిస్తుంటారు. త్రిశక్తి పీఠాన్ని దర్శించి, ఆరాధించుకునే అపూర్వమైన అవకాశాన్ని వెబ్‌దునియా మీకు అందిస్తున్నది. శాశ్వత పరమానందాన్ని పొందేందుకు
webdunia
WD PhotoWD
పూజించుకుందాం.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేరుకునే మార్గం:
విజయవాడ నగరానికి కీలకమైన ప్రాంతంలో కొలువైన ఈ దేవాలయానికి, రైల్వే స్టేషన్ నుంచి 10 నిమిషాలలో చేరుకోవచ్చు. విజయవాడ హైదరాబాద్ నగరానికి 275 కి.మీ.ల దూరంలో ఉన్నది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా విజయవాడకు చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu