Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆధ్యాత్మిక సుగంధాల మోహన్‌ఖేఢా తీర్థం

Advertiesment
పరమపవిత్రమైన మోహన్‌ఖేడా జైన తీర్ధం
, ఆదివారం, 13 జనవరి 2008 (17:52 IST)
WD PhotoWD
పరమపవిత్రమైన మోహన్‌ఖేడా జైన తీర్ధం, ధార్‌కు 47 కి.మీ.ల దూరంలో ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారికి సమీపంలో కొలువై ఉంది. పూజ్య గురుదేవ్ శ్రీ రాజేంద్ర సురీశ్వర్‌జీ మహారాజ్ సాహెబ్ 1940 సంవత్సరంలో ఈ తీర్ధాన్ని నెలకొల్పారు. ఈ తీర్ధంలో పద్మాసన భంగిమలోని భగవాన్ ఆదీశ్వర్ 16 అడుగుల విగ్రహం ప్రతిష్టించబడింది. అలాగే శ్రీ రాజేంద్ర సురీశ్వర్‌జీ, శ్రీ యతీంద్ర సురీశ్వర్‌జీ మరియు శ్రీ విద్యాచంద్ర సురీశ్వర్‌జీ మహరాజ్ సాహెబ్‌లకు చెందిన సమాధి మందిరాలు నిర్మించబడినవి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు, చైత్ర, పుష్య మాసాల సప్తమి రోజుల్లో ఇక్కడ తిరునాళ్ళ జరుగుతుంది.

ఈ సంవత్సరం జనవరి 15వ తేదీన తిరునాళ్ళ నిర్వహించబడుతుంది. మాల్వా ప్రపంచంలో అవతరించిన పరమ పూజ్యులైన దాదా గురుదేవ్ ప్రభు శ్రీమద్ విజయ్ రాజేంద్ర సురీశ్వర్‌జీ తన బోధనలతో ఈ ప్రాంతానికి పవిత్రతను తీసుకువచ్చారు. 1940 సంవత్సరంలో రాజ్‌గఢ్‌కు పశ్చిమంగా శతృంజయ అవతారమైన రిషబ్‌దేవ్‌జీ జైన దేవాలయాన్ని ఆయన నెలకొల్పారు. రాజ్‌గఢ్‌కు సమీపంలో ఖేడా పేరు గల ప్రాంతం కలదు. బంజారా సంచార జాతి ప్రజలు ఇక్కడ నివసిస్తుండేవారు.

పూజ్య గురుదేవులు ఈ ప్రాంతం గుండా వెళుతుండగా ఈ లోయ వద్ద ఆయన ఒక్కసారిగా నిలిచిపోయారు. తన యోగశక్తితో ఈ పర్వతంపై ఒక పుణ్యక్షేత్రం నిర్మితం కానున్నదని కనుగొన్నారు. ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే కాంతి పుంజం పూజ్య గురుదేవులకు దర్శనమిచ్చింది. రాజ్‌గఢ్‌కు తిరిగివచ్చిన అనంతరం ఖేడాక
webdunia
WD PhotoWD
వెళ్లి కుంకుమతో నిండిని స్వస్తిక్ ఆకారం కనిపించిన చోటును గుర్తించవలసిందిగా జిన్ లునాజీ పొర్వాల్‌ను ఆయన కోరారు. ఆ ప్రాంతానికి ఒక సంకేత చిహ్నాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గురుదేవులు సూచించారు.

అంతేకాక ఆ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించవలసిందిగా లునాజీని కోరారు. తదనుగుణంగా అక్కడకు చేరుకున్న జమీదార్ లునాజీకి కుంకమతో నిండిన స్వస్తిక్ ఆకారం కనిపించింది. దాదా గురుదేవుని స్మరించుకుంటూ అతడు తవ్వడం ప్రారంభించాడు. విక్రమ్ సమ్‌వత్ 1940 మార్గశిర శుక్ల సప్తమి నాడు అంజన్ షలక అనంతరం రిషబ్‌దేవునితో సహా అందరు జైన గురువులు ప్రతిష్టించబడ్డారు. పూజ చేసిన అనంతరం ఇకపై ఈ ప్రాంతం గొప్ప పుణ్య క్షేత్రంగా పిలవబడుతుందని పూజ్య గురుదేవులు ప్రకటించారు.

webdunia
WD PhotoWD
సిద్ధచతో సమానమైన కీర్తిని ఈ ప్రాంతం పొందుతుంది. ఇకపై ఈ ప్రాంతం మోహన్‌ఖేడాగా పిలవబడుతుంది. సిద్ధాచల్ తీర్ద్‌కు 108 పేర్లు కలవు. వాటిలో మోహన్‌గిరి అనే పేరు కలదు. శిరస్సుపైన మణిని ధరించిన శ్వేత సర్పం ప్రపంచంలో నివసిస్తోందని చెప్పబడింది. ఇప్పటికి కూడా జైనాలయానికి వెనుక గల చిన్న దేవాలయానికి రంధ్రాలు కనిపిస్తుంటాయి. సిద్ధాచల్‌తో పాటుగా యాత్రికులు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తుంటారు. స్మారక దేవాలయాన్ని భక్తులు ఇక్కడ నిర్మించారు. అలాగే ప్రతి సంవత్సరం పుష్య శుద్ధి సప్తమినాడు తిరునాళ్ళ జరుగుతుంది.

ఈ సంవత్సరం జనవరి 15వ తేదీన తిరునాళ్ళ నిర్వహించబడుతుంది. ఆరోగ్యకరమైన సంతరించుకుని ప్రశాంత పవనాలను వెదజల్లుతున్న మోహన్ ఖేడా తీర్ధం 108 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. తొలి తీర్ధంకరుడైన శ్రీ ఆదినాథ్, ఆదీశ్వర్ దాదా విగ్రహాలు సందర్శకులకు మరుపురాని అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఈ విగ్రహం మూడు ఆకృతులను సంతరించుకుంటుంది. ప్రాత:కాలమందు శిశువు ఆకృతిని, మధ్యాహ్నమందు యువకుని రూపాన్ని, సాయంకాలమందు ప్రాయంలో శాంతమూర్తి అయిన మానవాకారంలో కనిపిస్తుంది.

ఆచార్యదేవ్ శ్రీమద్ విజయశ్రీ హేమేంద్రసూరి విజయ్‌జీ, సన్యమ్‌స్థివీర్ మునిరాజ్ శ్రీ జయప్రభ మునిరాజ్‌శ్రీ రిషభ్‌చంద్ర విజయ్‌జీ, మునిరాజ్ శ్రీ హితేష్‌చంద్
webdunia
WD PhotoWD
విజయ్‌జీ, మునిరాజ్ పీయూష్‌చంద్ర విజయ్‌జీ తదితరుల ఆధ్వర్యంలో మోహన్‌ఖేడా తీర్ధం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

చేరుకునే మార్గం: రాజ్‌గఢ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని ఏకాంత ప్రదేశంలో తీర్థం నెలకొని ఉంది. తీర్థానికి 64 కి.మీ.ల దూరంలో మేఘ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్‌గా యాత్రికులకు అందుబాటులో ఉంది. తీర్ధానికి 112 కి.మీ.ల దూరంలో ఇండోర్ నగరం, 47 కి.మీ.ల దూరంలో పెద్ద పట్టణమైన ధార్ నగరం కలదు. బస్సులు మరియు ప్రైవేట్ వాహనాల ద్వారా యాత్రికులు తీర్థానికి చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu