Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యప్ప స్వామి కోయిక్కల్ దేవాలయం

Advertiesment
శబరిమలపై కొలువైన స్వామి అయ్యప్ప పండలమ్ రాజు పుత్రునిగా అవతరించినట్లు
, ఆదివారం, 6 జనవరి 2008 (17:16 IST)
WD PhotoWD
శబరిమలపై కొలువైన స్వామి అయ్యప్ప పండలమ్ రాజు పుత్రునిగా అవతరించినట్లు చెప్పబడింది. అచెన్‌కోవిల్ నది ఒడ్డున తన రాజప్రాసాదానికి అత్యంత సమీపంలో శబరిమల గిరిపై ప్రస్తుతం వలియ కోయిక్కల్ దేవాలయంగా పిలవబడుతున్న దేవాలయాన్ని పండలమ్ రాజు నిర్మించాడు.

స్వామి అయ్యప్ప యువకునిగా గడిపిన పండలమ్ ప్రాంతానికి శబరిమల ఉత్సవాల కాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. శబరిమలకు ప్రయాణించే భక్తులు ముందుగా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

మకరజ్యోతి దినాన్ని పురస్కరించుకుని శబరిమలపైన కొలువైన స్వామి అయ్యప్ప విగ్రహానికి ప్రత్యేకంగా అలకరించే పవిత్రమైన ఆభరణాలను పండలమ్ రాజప్రాసాదంలో ఉంచుతారు. మకరజ్యోతి దినోత్సవానికి రెండు మాసాల ముందుగానే భక్తులు పూజించే నిమిత్తం పవిత్రమైన ఆభరణాలతో కూడిన పెట్టెలను తెరిచి ఉంచుతారు.

స్వామి అయ్యప్ప విగ్రహానికి అలంకరించేందుకు ఉద్దేశించిన పవిత్రమైన ఆభరణాలను మకర జ్యోతి దినోత్సవానికి మూడు రోజుల ముందు పండలమ్ నుంచి శబరిమలకు ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ ఊరేగింపుకు రక్షణ కల్పిస్తున్నట్లుగా గగన తలంలో ఒక డేగ ప్రత్యేక్షమై శబరిమల వరకు సాగే ఊరేగింపును అనుసరిస్తుంది. డేగ రాకను భగవంతుని లీలగా భక్తులు భావిస్తుంటారు.

అయ్యప్ప తండ్రి హోదాను ఆపాదించుకునే పండలమ్ రాజకుటుంబానికి చెందిన సభ్యులు ఒకరు శబరిమల వరకు సాగే ఊరేగింపుకు భద్రతను కల్పిస్తున్నట్లుగ
webdunia
FileFILE
వ్యవహరిస్తారు. పండలమ్ కోయిక్కల్ శాస్థ దేవాలయం నుంచి జనవరి 12 మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమయ్యే "తిరువాభరణం" (పవిత్రమైన ఆభరణాలు) ఊరేగింపుకు రాజ కుటుంబ రక్షకునిగా తిరువథిరనల్ రాఘవవర్మ రాజా వ్యవహరిస్తారు.

స్థల పురాణ
స్వామి అయ్యప్ప వృత్తాంతానికి సంబంధించి వేర్వేరు ఇతివృత్తాలు ప్రచారంలో ఉన్నాయి. పండలమ్ రాజకుమారునిగా స్వామి అయ్యప్ప అవతరించిన వృత్తాంతం అత్యంత ప్రజాదరణ పొందినదై సర్వత్రా ఆమోదించబడింది. వృత్తాంతాన్ని అనుసరించి పండలమ్ రాజ్యాన్ని రాజా రాజశేఖర పరిపాలిస్తున్న కాలంలో, వేటకై బయలుదేరిన రాజుకు పంపా నది తీరాన ఒక శిశువు రోదిస్తున్న ధ్వని వినపడింది.

webdunia
WD PhotoWD
స్వరం వినిపిస్తున్న వైపుకు ప్రయాణించిన రాజుకు ఒక శిశువు కనిపించాడు. ఆ శిశువు దివ్యమైన ముఖ వర్చస్సుతో వెలుగొందుతూ కంఠాభరణంగా మణిని ధరించి ఉన్నాడు. హరిహరుల సంగమఫలితంగా మణికంఠుడు (కంఠమందు మణిని ధరించినవాడు), అనంతర కాలంలో అయ్యప్పన్‌గా పిలవబడే శిశువు జన్మించాడని పురాణాలలో ప్రస్తావించబడింది.

ఎంతో ధార్మిక చింతనను కలిగి ధానధర్మాలను చేస్తున్నప్పటకీ ఆ రాజుకు సంతానం ప్రాప్తించలేదు. తాను చేసిన పూజా ఫలితంగా తన తదనంతరం సింహాసనాన్ని అధిరోహించే వారసుని దైవం ప్రసాదించినట్లుగా భావించిన రాజు, తన రాజప్రాసాదానికి తీసుకుని వెళ్ళాడు. సకల శాస్త్ర పారంగతుడై, యుద్ధ విద్యలందు మెళుకువలు సంపాదించిన మణికంఠుడు బాలునిగా పెరిగాడు.

ఇదిలా ఉండగా రాణికి ఒక పుత్రుడు జన్మించాడు. అయితే మణికంఠుని తన జ్యేష్ట పుత్రునిగా భావించిన రాజు, అతనిని యువరాజుగా సింహాసనంపై కూర్చుండబెట్టాలని నిర్ణయించాడు. దుష్ట బుద్ధి గల మంత్రికి మణికంఠునిపై తీవ్రమైన ద్వేష భావాన్ని ఏర్పరుచుకున్నాడు. మణికంఠుని యువరాజుగా సింహాసనంపై కూర్చుండబెట్టిన పక్షంలో వాస్తవంగా మీ కుమారునికి దక్కవలసిన రాజ్యం మణికంఠునికి దారాదత్తం అయ్యే ప్రమాదం ఉందని ఉత్తమురాలైన రాణికి మంత్రి నూరిపోస్తాడు.

మణికంఠుని అడ్డు తొలగించేందుకు వారిరువురు కుట్ర పన్నారు. తమ కుట్రను అమలు చేసేందుకు రాజవైద్యుని కూడా చేర్చుకున్నారు. ఇక మణికంఠుని తొలగించుకునే కుట్ర కార్యాచరణకు నోచుకుంది. తాను విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లుగా రాణి నటించడం ప్రారంభించింది. పులిపాలతోనే రాణికి వచ్చిన కడుపు నొప్పి తగ్గు ముఖం పడుతుందని రాజవైద్యుడు నిర్దారించాడు.

రాజు తీవ్రమైన సంకటానికి గురయ్యాడు. పులిపాలను సంపాదించడమనే ఆత్మహత్యా సదృశ్యమైన కార్యానికి మానవమాత్రులెవరూ ముందుకు రారని రాజుకు
webdunia
WD PhotoWD
తెలుసు. పులి పాలను సేకరించేందుకు యువకుడైన మణికంఠుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. తన పెంపుడు తండ్రి వారిస్తున్నా వినకుండా భయానకమైన అరణ్యాల దిశగా మణికంఠుడు పయనమయ్యాడు.

కొన్ని రోజుల అనంతరం పులిని వాహనంగా చేసుకున్న మణికంఠుడు రాజప్రాసాద ఆవరణలోని ప్రవేశించాడు. మణికంఠునికి తోడుగా పులి పిల్లల సమూహం వేంచేసింది. తమ కుట్ర విఫలమైనందుకు రాణి, మంత్రి దిగ్భ్రాంతికి లోనయ్యారు. మణికంఠుడు మానవమాత్రుడు కాడని, కారణజన్ముడని కుట్రదారులతో సహా ఇతరులు అవగతం చేసుకున్నారు.

webdunia
WD PhotoWD
మణికంఠునిలోని దైవత్వాన్ని వారు కనుగొన్నారు. రాజ్యసంక్షేమం కోసం తమ పాపవిమోచనార్థం తమతో పాటుగా ఉండవలసిందిగా వారందరూ మణికంఠుని వేడుకున్నారు. అయినప్పటికీ, రాజప్రాసాదాన్ని విడిచి వెళ్ళాలని మణికంఠుడు నిర్ణయించుకున్నాడు.

సంతోషం, దుఃఖం, భయం, ఆశ్చర్యం మరియు భక్తితో కలిగిన భావోద్వేగాల మధ్య తనను తాను సమర్పించుకున్నవాడై నిలుచుండిపోయిన రాజు, మణికంఠుని కరుణా కటాక్ష వీక్షణాలకై ప్రార్థించడం మొదలుపెట్టాడు. మణికంఠునిలో దైవికశక్తులను గుర్తించక తన కుమారునిగా భావించి పెంచినందుకు మన్నించవలిసిందిగా పదేపదే అభ్యర్థించసాగాడు.

రాజు ప్రార్ధనలకు సంతసించిన మణికంఠుడు, రాజుకు మోక్ష సిద్ధి మార్గాన్ని చూపుతాడు. అంతేకాక పవిత్రమైన పంపానదికి ఉత్తరాన శబరమల గిరిపై దేవాలయాన్ని నిర్మించి, అందులో తన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు రాజుకు ఆనతిని ఒసంగుతాడు. అదేసమయంలో శబరిమల పుణ్యక్షేత్రం ప్రాశస్త్యాన్ని వివరించిన అయ్యప్ప, 'వ్రతం' యొక్క ప్రాధాన్యతను, తన 'దర్శనం' ద్వారా భక్తుల పొందే పుణ్యఫలాన్ని సమగ్రంగా వెల్లడిస్తాడు.

తన భక్తుల పూజలను రాజు కూడ అందుకుంటాడని ప్రకటించిన అయ్యప్ప, రాజుతో సహా అక్కడ ఉన్న అందరినీ ఆశీర్వదించి అంతర్థానమైపోయాడు. అనంతరం శబరిమలపై దేవాలయాన్ని నిర్మించిన రాజు, దేవాలయాన్ని అయ్యప్పకు అంకితమిచ్చాడు

శబరిమల యాత్రలో మకర జ్యోతి ప్రధానమైంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి కనపడుతుందని ప్రతీతి. ఆ రోజున పండలమ్ నుంచి
webdunia
WD PhotoWD
శబరిమలకు ఊరేగింపుగా చేరుకున్న పవిత్రమైన స్వర్ణాభరణాలతో స్వామి అయ్యప్ప విగ్రహాన్ని అలంకరిస్తారు. తదనుగుణంగా "తిరువభరణ ఘోష యాత్ర" అత్యంత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది.

చేరుకునే మార్గ
పండలమ్ పట్టణానికి ఒక కి.మీ దూరంలో గల మెయిన్ సెంట్రల్ రోడ్డుకు సమీపంలో వలియకోయిక్కల్ దేవాలయం కొలువై ఉంది. పండలమ్ బస్ స్టేషన్ అత్యంత సమీపమైంది. ఇక్కడకు 14 కి.మీ.ల దూరంలోని చెంగన్నూర్ రైల్వే స్టేషన్ సమీపమైంది. దాదాపు 100 కి.మీ.ల దూరంలో గల తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపమైంది.

Share this Story:

Follow Webdunia telugu