Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవతలు కొలువుండే కైలాస పర్వతం

Advertiesment
కైలాస పర్వతం... సముద్రమట్టానికి 22
, సోమవారం, 31 డిశెంబరు 2007 (16:27 IST)
WD PhotoWD
కైలాస పర్వతం... సముద్రమట్టానికి 22,028 అడుగుల ఎత్తైన మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరం. కైలాస పర్వతం మరియు చేరుకోవడానికి సాగించే ప్రయాణం అంతరాత్మ పిలుపుగా భక్తులు భావిస్తుంటారు. పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక నెలవులో వేల సంఖ్యలో మహర్షులు, సామాన్య మానవులు, తత్వవేత్తలు మరియు దేవతలు సైతం ధ్యాన ముద్రలో ఇక్కడి పవిత్రవాతావరణంలో మమేకమైపోతారు.

కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. కైలాస పర్వతం మరియు మానవసరోవరం సృష్టికన్నా పురాతనమైనవిగా ప్రతీతి. నాదం మరియు కాంతులతో మిళితమైన ఈ ప్రాంతంలో నిజమైన యోగి ఓంకారంలో విలీనమైపోతారు. భారతీయ తాత్విక చింతన మరియు నాగరికతకు ఈ ప్రాంతం హృదయ కేంద్రం వలె భాసిల్లుతున్నది. గొప్పదైన మానవసరోవరం భారతీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.

పర్వతం యొక్క ఏటవాలు భాగాన్ని కల్ప వృక్షం ఆపాదించుకున్న రీతిలో కనిపిస్తుంది. పర్వతం యొక్క దక్షిణ భాగం నీలమణి, తూర్పు భాగం స్ఫటికం, పశ్చిమ భాగం కెంపు మరియు ఉత్తర భాగం స్వర్ణంగా చెప్పబడింది. కుబేరుని రాజ్యం ఇక్కడే కొలువై ఉంది. మహావిష్ణువు కాలి బొటనవేలి నుంచి ఉద్భవించిన గంగా నది
webdunia
WD PhotoWD
చాంద్రమాన వృత్తంలో ప్రవేశించి అనంతరం కైలాస పర్వత శిఖరం నుంచి దివికి ఏతెంచింది. గంగానది ఉధృతిని నియంత్రించేందుకు మహాశివుడు ఆమెను తన జటాజూటంలోకి స్వీకరించాడు.

బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటోంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్‌చొక్ ( బుద్ధుని ఉగ్రరూపం) ను బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. దీనినే ధర్మపాలగా పిలుస్తుంటారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తుంటారు. తొలి తీర్థాంకరులు ఇక్కడే నిర్వాణం పొందారని జైన మతస్థుల నమ్మిక. గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెప్తుంటారు.

webdunia
WD PhotoWD
కైలాస పర్వతం మరియు పర్వత సానువులోని మానవ సరోవరానికి చెందిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత బహుముఖమైంది. సర్వ మతాలకు చెందిన అన్ని వయస్సుల వారు వేర్వేరు మార్గాలలో ఈ ప్రాంతాన్ని పూజిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని బహుళ జనాదరణ పొందిన పురాణాలు మరియు కల్పనలు సర్వమత సమానత్వాన్ని మానవాళికి ప్రబోధిస్తుంటాయి.

మానస సరోవర దర్శనం...

మాంధాత మహారాజు మానస సరోవరం సరస్సును కనుగొన్నాడని చెప్పబడింది. మానవ సరోవరం ఒడ్డున గల అద్భుతమైన పర్వతాల సమీపంలో మాంధాత ఘోరమైన తపస్సు చేసినందున ఆ పర్వతాలకు మాంధాత నామం సంక్రమించింది. సరోవర మధ్య భాగంలో ఒక వృక్షం ఉందని బౌద్ధ మతస్తులు విశ్వసిస్తుంటారు. ఆ వృక్షానికి కాచే ఫలాలు శారీరక మరియు మానసిక రుగ్మతలను నయం చేస్తాయని వారి నమ్మకం.

కైలాస పర్వత యాత్ర సాహస యాత్రకు ఏ మాత్రం తీసిపోనందున, అవాంఛనీయ సంఘటనలు, అనారోగ్య పరిస్థితులను యాత్రికులు చవి చూడవలసి వస్తుంది.
webdunia
WD PhotoWD
సముద్రమట్టానికి సగటున 3500 మీటర్ల ఎత్తున ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాలలో తగినంత ఆక్సిజన్ లభించదు కనుక తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, అసౌకర్యంగా అనిపించడం తదితర అనారోగ్య లక్షణాలు తలెత్తుతాయి. వీటిన్నిటికి విశ్రాంతికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు. కొత్త వాతావరణానికి దేహ తత్వం తనను తాను మలుచుకుంటుందనే అంశాన్ని కొన్ని లక్షణాలు తెలుపుతుంటాయి.

webdunia
WD PhotoWD
కైలాస పర్వతాన్ని చేరుకునే మార్గం :

1) భారతదేశం నుంచి రోడ్డు ద్వారా : భారత ప్రభుత్వం మానవసరోవర సరస్సుకు యాత్రలు నిర్వహిస్తుంటుంది. ఈ యాత్రలో 28 నుంచి 30 రోజుల పాటు పర్వతాలపై కొనసాగుతుంది. యాత్రకు సంబంధించిన సీట్లు పరిమతమైనందున చాలా రోజుల ముందుగానే సీట్లను రిజర్వ్ చేసుకోవాలి. యాత్రలో పాల్గొనేవారిని డ్రా నిర్వహించడం ద్వారా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది.

2) విమానం ద్వారా ఖాట్మండు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు ద్వారా కైలాస పర్వత దిగువభాగంలోని మానస సరోవర సరస్సును చేరుకోవచ్చు.

3) హెలికాఫ్టర్ ద్వారా : ఖాట్మండు నుంచి నేపాల్‌గంజ్ మరియు అక్కడి నుంచి సిమికోట్‌కు నిర్దేశిత వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. సిమికోట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా హిల్సా చేరుకోవచ్చు. అక్కడి నుంచి ల్యాండ్ క్రూయిజర్ల ద్వారా మానససరోవరానికి చేరవచ్చు.

4) ల్హాసా గుండా ప్రయాణం : ఖాట్మండుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి చైనా విమానం ద్వారా ల్హాసా చేరుకోవచ్చు. అక్కడి నుంచి టిబెట్‌లోని షిగెట్సె, గ్యాంట్సె, ల్హాట్సె, ప్రయాగ్ తదితరాల నగరాలను దర్శించుకుంటూ మానస సరోవరానికి చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu