జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్ ఆలయం
దేశంలో ఉన్న ప్రఖ్యాత జైన పుణ్యక్షేత్రాలలో రాజస్థాన్లోని శ్రీ మహావీర్జీ ఆలయం ఒకటి. 24వ జైన సాధువు మహావీరుని గౌరవార్థం తెల్లని పాలరాయితో గంభీర్ నదీ పరివాహక ప్రాంతంలో శ్రీ మహావీర్జీ ఆలయం నిర్మితమై ఉంది. దేవాలయ నిర్మాణానికి కారణమైన అద్భుతమైన దృష్టాంతం బహుళ ప్రాచుర్యం పొందింది. కొన్ని శతాబ్దాల కాలం ప్రతిరోజు ఉదయం ఇంటిని విడిచి మళ్ళీ సాయంత్రానికి గూటికి చేరుకునే ఆవు ఒకటి ఉండేది. ఇందులో ఆశ్చర్యజనకమైంది ఏమీ లేకపోయినప్పటికీ, సాయంత్రం ఇంటికి చేరుకునే సమయానికి ఆవు పొదుగులు ఖాళీగా ఉండేవి. రహస్యం ఏమిటో
తెలుసుకునేందుకు, ఆవును అనుసరించిన ఆవు యజమాని కుమారుడు ఆవు ఒక చోట ఆగి తనంతట తానే తన పొదుగును ఖాళీ చేసుకుంటున్న వైనాన్ని గుర్తించాడు. మర్మం ఏంటో తెలుసుకుందామన్న ఆసక్తితో అతడు ఆ ప్రాంతాన్ని తవ్వినంతనే మహావీరుని విగ్రహం బయటపడింది.ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెల్లని పాలరాతి వేదికపై నిర్మితమైన మహావీర్జీ దేవాలయం పురాతనమైన మరియు ఆధునిక జైన శిల్పకళాకృతి మేలు కలయికగా నిలుస్తున్నది. పురాతనమైన జైనదేవాలయాలు అత్యధికంగా ఆభరణ శోభితమై, ఉన్నతస్థాయిలో మలచబడి ఉన్న నేపథ్యంలో, అందుకు భిన్నంగా నిర్మాణాకృతిలో మహావీర్జీ దేవాలయం సమకాలీకతను సంతరించుకున్నది. ఇతర జైన దేవాలయాల రీతిలో, ఈ దేవాలయం కూడా చిన్న దేవాలయాల సమూదాయంగా వెలుగొందుతున్నది. ప్రధాన దేవాలయంలో కూర్చున్న భంగిమలోని జైన సాధువుల విగ్రహాలు, చక్కగా చెక్కబడిన స్థంభాల మధ్య కనిపిస్తాయి. అతిపెద్దదైన శాంతినాథ్ విగ్రహం, జైన మతస్థాపకులలో ఒకరు, 32 అడుగుల ఎత్తును కలిగి భక్తులపై కరుణాకటాక్షవీక్షణాలను ప్రసరింపచేస్తూ ఉంటుంది. విగ్రహానికి సమీపంలో బాల్కనీని కిరీటంలా ఆపాదించుకున్న ఎత్తైన కట్టడం కనిపిస్తుంది. ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సూర్యుడు కనుమరుగైన సమయంలో ప్రకృతిలో చీకటి విస్తరించుకుంటున్న వేళ వేలకొలది దీపాలు వెలుగొందుతుండగా దేవాలయ ప్రాంగణం, అక్కడ దీపోత్సవం జరుగుతన్నదేమో అన్న భ్రాంతిని చూపరులకు కలిగిస్తుంది. ప్రత్యేక ఉత్సవాలు జరిగే మార్చి, ఏప్రిల్ మాసాలలో సందర్శకులు వాలయానికి విచ్చేసేందుకు అనువైన కాలం. ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.సందర్శించేందుకు సరియైన కాలం: శ్రీమహావీర స్వామి స్మృత్యర్థం చైత్ర శుక్ర ఏకాదశి నుంచి వైశాఖ కృష్ణ ద్వితీయ (మార్చి-ఏప్రిల్) మధ్య కాలంలో నిర్వహించబడే శ్రీమహావీర్జీ ఉత్సవం జరిగే సమయం సందర్శకులకు సర్వోత్తమమైన కాలం.చేరుకునే దారి: రైలు మార్గం ద్వారా: న్యూఢిల్లీ-ముంబై బ్రాడ్ గేజ్ రైల్వే మార్గంపైన గల సవాయి మధోపూర్కు ఈ దిగంబర జైన పుణ్యక్షేత్రం 90 కి.మీ.ల దూరంలో
ఉన్నది.
రోడ్డు మార్గం ద్వారా: మహావీర్జీ దేవాలయం, జైపూర్కు 176 కి.మీ.ల దూరంలో ఉన్నది.
విమాన మార్గం ద్వారా: 176 కి.మీ.ల దూరంలో జైపూర్ విమానాశ్రయం ఉన్నది.