మనోహర్ స్వరూప్ అనే భక్తుడు తన నాలుకను సమర్పించుకోవడాన్ని చూశాము. వివాహం జరిగి 12 సంవత్సరాలు కావొస్తున్న మనోహర్కు సంతానప్రాప్తి కలగలేదని అతని సోదరుడు మాతో అన్నాడు. తనకు సంతానం కలిగితే అత్రిమాతకు నాలుకను సమర్పించుకుంటానని మనోహర్ మొక్కుకున్నాడు. అతని కోరిక తీరింది, దాంతో మొక్కు తీర్చుకుందామని మనోహర్ ఇక్కడకు వచ్చాడు.మా కళ్లముందే అతడు తన నాలుకను అత్రిమాతకు సమర్పించుకున్నాడు. మనోహర్ వలె అనేక మంది భక్తులు తమ నాలుకను మాతకు సమర్పించుకుంటున్నారు. నాలుకను సమర్పించుకున్న అనంతరం కొంతకాలం ఈ దేవాలయంలో ఉండాలని భక్తుల విశ్వాసం. దేవాలయంలో 8 నుంచి 10 రోజులు ఉన్న తర్వాత, నాలుకను సమర్పించిన వారు తమ గాత్రాన్ని తిరిగి పొందుతారు. ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.దేవాలయంలో 10 రోజులు గడిపిన అనంతరం తనకు మాట వచ్చిందని ప్రభాత్ దేవ్ అనే భక్తుడు మాతో అన్నాడు.అత్రిమాతకు నాలుకను సమర్పించుకోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన మాకు మతి పోయినంత పనైంది. హఠాత్తుగా అనేక సందేహాలు మా మెదడులో
తలెత్తాయి...ఎవరైతే తమ దేహాన్ని గాయపరుచుకుంటారో వారికి దుర్గామాత ప్రసన్నురాలవుతుందా?
ఇటువంటి పనులు వారి కోరికలను తీరుస్తాయా? ఉన్మాదులను పోలినట్లు ఊగిపోతున్న ప్రజలలోకి మానవాతీత శక్తులు ప్రవేశిస్తాయా? ఈ ప్రశ్నలుకు ఎంత వెతికినా మా దగ్గర సమాధానం దొరకలేదు...మీరేమని అనుకుంటున్నారో దయ చేసి మాకు రాసి పంపండి...