Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చుహాపల్లిః గంధర్వపురి దేవాలయ అద్భుతం

చుహాపల్లిః గంధర్వపురి దేవాలయ అద్భుతం
WD
ఏదినిజం వరుసలో చారిత్రక, ఆధ్యాత్మిక గుర్తింపు పొందిన ప్రత్యేక దేవాలయాన్ని పరిచయం చేస్తున్నాం. ఈ దేవాలయం పలు అద్భుతాలు కలిగి ఉన్నట్టు చెబుతున్నారు. గంధర్వసేన సామ్రాజ్యంలోని గంధర్వపురిలోని ఈ దేవాలయం గంధర్వసేను దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ గంధర్వసేనుడు ఉజ్జయిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విక్రమాదిత్యుని తండ్రి.

ఈ దేవాలయంలో ఓ పవిత్ర పాము గర్భగుడి కింది భాగంలో నివసిస్తుండగా, ప్రతి రాత్రి కొన్ని ఎలుకలు ఆ పాము చుట్టూ తిరుగుతున్నాయి. ఇలా చేయడం ద్వారా అవి పాముకు పూజలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ దృశ్యాన్ని ఎవరూ ప్రత్యక్షంగా చూడనప్పటికీ, ప్రతిరోజూ ఉదయం పాము మలం పక్కనే ఎలుకల మలం ఉండటాన్ని చూస్తున్నారు. దీనికి కారణమేమిటనే విషయం ఇంతవరకు వెలుగు చూడలేదు. ఈ ప్రదేశాన్ని పలు పర్యాయాలు శుభ్రపరిచినప్పటికీ, మళ్లీ అదే రీతిలో అక్కడ మలం చేరుతోంది.
webdunia
WD


ఈ దేవాలయంలో గంధర్వసేనుడి విగ్రహం ఏర్పాటు చేశారు. మాల్వా ప్రాంతంలో ఆయనను గార్ధభిల్‌గా పిలుస్తున్నారు. అయితే రాజుకు సంబంధించి భిన్న కథనాలు విన్పిస్తున్నా, ఈ ప్రాంతానికి సంబంధించిన కథ మాత్రం కొంత అసాధారణంగా ఉంది. ఈ దేవాలయాన్ని ఏడెనిమిది ఉప భాగాలుగా విభజించారని ప్రజలు విశ్వసిస్తున్నారు. దేవాలయ మధ్య భాగంలో రాజు విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రధాన దేవాలయం మినహా ఇందులో పలు భాగాలు కాలంతో పాటు దెబ్బతిన్నాయి.

పూజారి మహేష్ కుమార్ కథనం ప్రకారం... దేవాలయంలో పురాతన కాలంలో పుట్ట ఉండేదని, ప్రజలు కూడా ఇక్కడికి సమీపంలోని నది వద్ద, గుడి పక్కన అడవిలోనూ పాములు చూశారని తెలిపారు. అయితే దేవాలయ ప్రాంగణంలోనే ఎలుకలు ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ పాము దేవాలయ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తోందని తమ ముత్తాతల ద్వారా తెలుసుకోగలిగామని వారు చెబుతున్నారు. చిన్న తనం నుంచే ఈ అద్భుతం చూస్తున్నామని స్థానికులైన కమల్‌సోని, కేదార్‌నాథ్‌సింగ్‌లు చెబుతున్నారు. ఈ పసుపు రంగు పాము పన్నెండు అడుగుల పొడవు కలిగి ఉందన్నారు. మరో గ్రామస్తుడైన రమేష్ చంద్ర జాలాజీ దఈ పాము తమకు గర్వకారణంగా ఉంటోందని చెప్పారు.

webdunia
WD
ఎలుకలలాగే ఈ దేవాలయ ప్రాంగణాన్ని సోమావతి నది కూడా చుట్టుముడుతోంది. గ్రామ పెద్ద విజయ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఈ సంప్రదాయం వేల సంవత్సరాల నుంచి వస్తోందన్నారు. దేవాలయ ప్రాంగణంలో అడుగుపెడితే బాధలు, పాపాల నుంచి ప్రతి ఒక్కరికీ విమోచనం లభిస్తుందన్నారు. ఈ దేవాలయ ధ్వజస్తంభం పార్మార్ హయాంలో నిర్మించగా, దేవాలయ ఆధారం బుద్ధుడి కాలంలోనే ఏర్పాటు చేసినట్టు విశ్వసిస్తున్నారు. ఈ తరహా ఉదంతంపై మీరు విశ్వాసం ఉందా అనే అంశంపై మీ అభిప్రాయాలు తెలుసుకోగోరుతున్నాం... మీ స్పందనను మాకు తెలపండి...

Share this Story:

Follow Webdunia telugu