Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహ దోషాలు తొలగిపోవాలంటే.. మాంగాడు క్షేత్రాన్ని దర్శించుకోండి!

Advertiesment
Significance of chennai Mangadu temple
, సోమవారం, 8 డిశెంబరు 2014 (19:25 IST)
వివాహ విషయంలో దోషాలు కలుగుతున్నాయా? అమ్మాయికి గానీ, అబ్బాయికీ కానీ వివాహంలో జాప్యం, అడ్డంకులు ఏర్పడుతున్నాయా? అయితే తమిళనాడులోని "మాంగాడు"క్షేత్రాన్ని దర్శించుకోండి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. 
 
మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం తమిళనాడు - చెన్నై సమీపంలో విలసిల్లుతోంది. కామాక్షీదేవి (పార్వతీదేవి) కాంచీపురంలోని 'ఏకామ్రేశ్వరస్వామి'ని వివాహమాడటం కోసం ఇక్కడే తపస్సు చేసిందని స్థలపురాణం చెబుతోంది.
 
వివాహం విషయంలో అమ్మవారి కోరిక నెరవేరిన ప్రదేశం కావడం వలన, వివాహం విషయంలో ఆడపిల్లల మనసును అర్థంచేసుకునే అమ్మవారు మనస్సుకు నచ్చిన వారితో వివాహం జరిపించేలా అనుగ్రహిస్తారు. ఈ కారణంగానే వివాహ సంబంధమైన సమస్యలు ఎదుర్కుంటోన్న వాళ్లు, ఇక్కడ కొలువైన కామాక్షీ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.
 
అమ్మవారిని దర్శించుకుని తమ ఆవేదనను చెప్పుకున్న యువతులకి అనతికాలంలోనే వివాహయోగం కలుగుతుందని అంటారు. అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుందనడానికి నిదర్శనం, ఆ తల్లి ఆశీస్సుల కారణంగా వివాహమైనవారు తమ మొక్కులను చెల్లించుకోవడానికి పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉండటమేనని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu