Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోటితో శబ్దం చేస్తూ.. నొసటితో వెక్కిరించరాదు!

Advertiesment
ఆధ్యాత్మిక చింతన
ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న వారు భగంవతుని తమకు తోచిన రీతిలో స్మరిస్తుంటారు. వాస్తవంగా చూస్తే.. భగవంతుని నామాన్ని మూడు విధాలుగా స్మరిస్తారు. ఈ నామస్మరణ మనస్సులోనే చేయవచ్చు, వాక్కుతో జీర్ణించనూ వచ్చు. గొంతెత్తి కీర్తనం చేయొచ్చు. భగవద్గీతలో భగవంతుడికి గల మూడు కారణాలను సూచించడమైందన్నారు. వాటినే అవే ఓం, తత్, సత్‌లు.

ఇందులో "ఓం" అనే ప్రణవాక్షర శబ్దంతో నామస్మరణ చేస్తే భగవంతుడు పలుకుతాడు. నామజపం చేస్తున్నప్పుడు నామాన్ని మనస్సులోనే లెక్కించాలి కానీ.. వేళ్ళతో, మాలతో లెక్కించరాదు. ముఖ్యంగా, భగవంతుడు తన ఎదుటే ఉన్నాడు అని భావించి ఆ రూపాన్ని మనస్సులోనే చిత్రీకరించుకోవాలి.

సాధారణంగా గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని ఎవరైనా పేరుపెట్టి పిలిస్తే ఆ వ్యక్తి వెంటనే మేల్కొంటాడు. శబ్దం నిద్రలో ఉన్న వ్యక్తికి కూడా చేరుతుంది. శబ్దంలో ఉన్న శక్తి అహంకారం వరకు చేరుతుంది. శబ్దానికి ఉన్న శక్తి అటువంటిది. ఎవరైతే భగవన్నామాన్ని ఏకాగ్రతతో జపిస్తారో వారికి భగవంతుని దర్శనం లభిస్తుంది. అలాగే మహాపురుషుల ఉపదేశాలను వింటే జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఎవరి వాక్కులో అసత్యం, కఠినత్వం, నింద, అసూయ, పరచర్చ, వృథావాదనలు ఉంటాయో వారి శబ్దముల ప్రభావం ఇతరులపై ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రవర్తన వలన శబ్దానికి ఉన్న శక్తి నశిస్తుందిట

ఇదంతా ఎందుకు చెపుతున్నామంటే.. ప్రపంచ మారుతోంది. మనమూ మరాలి. మారుతున్నాం. చేసే పని మీద శ్రద్ధ, భక్తి, విశ్వాసం, పట్టుదల ఉండాలి. నోటితో స్మరణ చేస్తూ నొసలు వెక్కిరించడాన్ని భగవంతుడు స్వీకరించడు. అలాంటి వ్యక్తుల నోటి నుంచి వెలువడే శబ్దం తన శక్తిని కోల్పోయి ఉంటుంది. కాబట్టి సత్‌ప్రవర్తనతో శబ్ద శక్తిని కాపాడుకోవాలి. ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి మానవుడు సత్ ప్రవర్తనతో నడుచుకోవాలని భగవద్గీత సూచిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu