Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేసిన పుణ్యం కొద్దీ భార్య లభిస్తుందని ఎందుకంటారు!?

Advertiesment
ఇంద్రుడు
FILE
"త్వత్కళా సర్వయోషత:" అంటూ ఇంద్రుడు మహాలక్ష్మిని స్తుతిస్తాడు. అందుచేతనే పేరంటాలు, కన్యకాపూజ, సువాసినీ పూజ మొదలైన స్త్రీ ఆరాధనలు సంప్రదాయాలయ్యాయి. ప్రతి స్త్రీలో లక్ష్మీ కళ ఉంటుంది.

అందుకే పురుషుడు చేసిన పుణ్యం కొద్దీ భార్య లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీలను కొట్టడం, తిట్టడం తగదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. స్త్రీ ఫలరూపిణి, అందుకే స్త్రీలు ఉన్నచోట లక్ష్మీకళ ఉట్టిపడుతుంది. ఇంకా స్త్రీలు ఉండే ఇళ్ళల్లో లక్ష్మీదేవి కొలువైవుంటుంది. కానీ స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మీదేవి ఉండదు.

ఇకపోతే.. లక్ష్మీదేవిని శ్రావణమాసంలో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీవ్రతంగా పాటించడం సంప్రదాయం. కొత్తగా పెళ్లైన ఆడపిల్లల చేత ఈ వరలక్ష్మీ నోముని పాటించడం ఒక ఆచారం. అయితే సాధారణంగా అన్ని శుక్రవారాలు మహాలక్ష్మి పూజకు శ్రేష్టమని పురోహితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu