కొబ్బరి గౌరీ వ్రతాన్ని ఆచరించడం ఎలా..!?
సింధు రాష్ట్రంలో ఒక బ్రాహ్మణోత్తముని భార్య కొబ్బరి గౌరీ వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతాన్ని ఆచరించిన విధానం ఎలా చేయాలంటే.. వ్రతమాచరించిన దినం ఉదయాన్నే లేచి, అభ్యంగన స్నానమాచరించి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి. పూజాగదిని రంగవల్లికలతో, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం పురోహితుని పిలిపించి, కొబ్బరి చెట్టుకింద అలికి ముగ్గులు పెట్టి అవకాశం కొలదీ, బంగారు వెండి కొబ్బరికాయలను చేయించాలి, కొబ్బరి చెట్టుకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టాలి. మండపం ఏర్పాటు గావించాలి. దానిపై బియ్యం వేసి గౌరీశంకరుల నందు నంది వాహనం చేసి దానిపై అవాహనం గావించాలి. ఈ కొబ్బరికాయల నటుంచి భక్తితో పూజ గావించి దక్షిణ తాంబూలాలతో వాటిని పుణ్యదంపతులకు ఇవ్వాలి. 11
అద్దాలు, 11 దువ్వెనలు, 11 భరణెలు. 11 నల్లపూసల పేర్లు, 11 కొబ్బరికాయలు, 11 రవికెల బట్టలు, 11 పేరంటాండ్రకు బొట్టుంచి, ఏకాదశరుద్రాణాలుగా భావించి భక్తి తాత్పర్యంలో సమర్పించాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.