కుంకుమను దానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయట!
సుమంగళులు ఇచ్చే కుంకుమతో ఇంట్లో ఉండే వివిధ దోషాలు తొలగిపోతాయి. కుంకుమను దానం చేస్తే ఇంట్లో ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి. కుంకుమ సుమంగళిలకు, దేవతలకు చాలా ఇష్టం.కుంకుమకు దృష్టి పరిహారం చేసే శక్తి ఉంది. ఎవరైతే ప్రతీరోజూ కుంకుమను నుదుట ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదం ఉంటుంది. అలాంటి కుంకుమతో చేసే అర్చనతో అన్ని రకాల దేవతలు, దేవిలు తృప్తి చెందుతారు ఇక కుంకుమను గుమ్మడి కాయలో ఉంచి దిష్టి తీసి కొడితే అన్నిరకాల దిష్టి దోషాలు దూరమవుతాయి. కుంకుమ నీటితో దిష్టి తీసి వీధిలో పారబోస్తే దృష్టి దోషాలు దరి చేరవని పురోహితులు చెబుతున్నారు.