Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీక శని, ఆదివారాల్లో దీపాలు ఎలా వెలిగించాలంటే..!?

Advertiesment
కార్తీక మాసం
FILE
కార్తీక మాసంలో శివుడిని ప్రార్థిస్తూ దీపాలు వెలిగించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చే శని, ఆదివారాల్లో ఉత్తర దిశలో నేతితో దీపమెలిగించిన వారికి కుబేర అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

తపోశక్తిచే పరమేశ్వరునికి స్నేహితుడైన కుబేరునికి కార్తీక శుక్రవారాల్లో పూజమందిరం లేదా ఆలయాల్లో నేతితో ఉత్తర దిశన దీపమెలిగిస్తే ఆర్థిక వృద్ధి ఉంటుందని పురోహితులు చెబుతున్నారు.

దీపమెలిగించే సమయాన ముందుగా దీపాన్ని ముందుగా నూనెను లేదా నేతితో నింపి తర్వాత తామర, దూది వత్తులను వేయాలి. అలాగే పూజ పూర్తయ్యాక నైవేద్యం సమర్పించి దీపారాధన చేసేటప్పడు కర్పూరం కింద విభూతిని పెట్టి హారతి ఇవ్వాలి. ఆ విభూతిని ప్రతిరోజూ ధరిస్తే శుభఫలితాలు ఉంటాయి.

కార్తీక సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో పంచముఖాలతో కూడిన దీపాలు వెలిగించే వారికి వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. అలాగే ఆలయాల్లో నేతితో పంచముఖ దీపాలు వెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu