Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రదోష వ్రతం ఎలా చేయాలి.. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి?

Lord Shiva
, సోమవారం, 25 జులై 2022 (20:44 IST)
ప్రదోషం వ్రతాన్ని ఆచరించే వారికి ఈతిబాధలు వుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి. శరీరంపై విభూతిని, రుద్రాక్షమాలను కూడా ధరించటం మంచిది. ఆ రోజులో వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని (ఓం నమ:శివాయ) జపం చేయాలి. 
 
ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించటాన్ని శివుడు ఇష్టపడతాడని చెబుతారు. కఠిన ఉపవాసం చేయలేనివారు పండ్లు, పాలు లాంటివి తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థాలను తీసుకోకూడదు. 
 
సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు, శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. 
 
మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.
 
మహా మృత్యుంజయ మంత్రము 
ఓం త్రయంబకం యజామహే 
సుగంధిం పుష్టి వర్ధనం 
ఊర్వారుకమివ బంధనాత్ 
మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనే మంత్రాన్ని పఠించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం భౌమ ప్రదోషం.. శివారాధన చేస్తే..?