Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారీగా పెరిగిన శ్రీకాళహస్తి ఆదాయం... రాబడి రూ.3 కోట్లు..అన్నీ పాత నోట్లే..!

పెద్ద నోట్లు రద్దు తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం మెల్లగా పెరుగుతోంది. నోట్లు రద్దయిన మొదటివారంలో పెద్ద మార్పు కనిపించలేదుగానీ. ఆ తరువాత క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది.

భారీగా పెరిగిన శ్రీకాళహస్తి ఆదాయం... రాబడి రూ.3 కోట్లు..అన్నీ పాత నోట్లే..!
, శనివారం, 3 డిశెంబరు 2016 (17:39 IST)
పెద్ద నోట్లు రద్దు తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం మెల్లగా పెరుగుతోంది. నోట్లు రద్దయిన మొదటివారంలో పెద్ద మార్పు కనిపించలేదుగానీ. ఆ తరువాత క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. హుండీ కానుకలు రూ.3 కోట్లు దాటుతున్న రోజుల సంఖ్య గతంలో పోల్చితే పెరుగుతోంది. అయితే అనూహ్యంగా ఆశ్చర్యం గొలిపే స్తాయిలో మాత్రం హుండీ కానుకలు పెరగలేదు. నెల రోజుల కానుకల వివరాలు విశ్లేషిస్తే..
 
నవంబర్‌ నెలలో హుండీ ఆదాయం రూ.3 కోట్లు అంతకు మించి వచ్చిన రోజులు 14 ఉన్నాయి. రూ.2.75 కోట్లకు మించి వచ్చిన రోజులు చేస్తే 23 ఉన్నాయి. 21వ తేదీన రూ.4.18 కోట్లు సమకూరింది. గతంలో రూ.5 కోట్లకు మించి కానుకలు వచ్చిన సంధర్బమూ ఉంది. నోట్లు రద్దుకాక మునుపు అంటే నవంబర్‌ తొలివారంలో చూస్తే మూడు రోజులు రూ.3 కోట్లు దాటిన పరిస్తితి కనిపిస్తోంది. నోట్లు రద్దయిన వారంలో రెండు రోజులు రూ.3 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది.
 
నోట్లు రద్దన రెండోవారంలో చూస్తే గణనీయమైన ఆదాయం వచ్చింది. ఆ వారంలో 4 రోజులు రూ.3 కోట్ల మార్కును దాటింది. ఒకరోజు రూ.2.95 కోట్లు. ఇంకోరోజు రూ.2.84 కోట్లు వచ్చాయి. అంటే మూడు ఓట్లకు దగ్గర్లో ఉన్నట్లు లెక్కించుకోవాలి. ఆరు రోజులూ రూ.3 కోట్లు వచ్చాయని అనుకోవచ్చు. అత్యధికంగా రూ.4.18 కోట్లు వచ్చిన రోజు కూడా ఈ వారంలోనే ఉంది. నోట్ల రద్దు అనంతరం మూడో వారంలో గమనిస్తే ఏకంగా ఐదు రోజులు రూ.3 కోట్లు దాటింది.
 
గతంలో యాత్రికుల సంఖ్య 80 వేలు దాటినప్పుడు మాత్రమే హుండీ ఆదాయం రూ.3 కోట్లకు మించేదని, అయితే ఇప్పడు 60 వేలు - 70 వేల మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నా హుండీ కానుకలు ఆ స్థాయిలో వస్తున్నాయని ఆలయ ఉద్యోగులు చెబుతున్నారు. భక్తులు సమర్పించే కానుకలు మొత్తం పెరగడం వల్లే ఆదాయంలో మార్పు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
 
నోట్ల మార్పిడికి డిసెంబర్‌ 31వతేదీ ఆఖరు కావడంతో ఈ నెలలో శ్రీవారి ఆలయంలో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. నోట్లు మార్చుకోలేమని వారు హుండీ ద్వారా స్వామికి సమర్పించవచ్చని భావిస్తున్నారు. అయితే కేంద్రం స్వచ్ఛంద ఆదాయం వెల్లడికి మరో అవకాశం కల్పించింది. తమ వద్ద లెక్కల్లోలేని ధనం ఉండదని స్వచ్చందంగా ఒప్పుకుని బ్యాంకుల్లో జమచేస్తే 50 శాతం పన్నుతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్వామి హుండీకి అనూహ్యంగా ఆదాయం పెరగకవపోచ్చన్నది మరో అంచనా.
 
డిసెంబర్‌ 31 తర్వాత పాత నోట్లు చెల్లబోవని చెబుతున్నా స్వామివారి హుండీలో పడే కానుకలను మార్చుకోవడానికి తితిదే ఇబ్బంది ఉండబోదు. మార్చి 31 దాకా రిజర్వు బ్యాంకులో పాతనోట్లను మార్చుకునే వీలుంది. తితిదే ఎటూ బ్యాంకులో నగదు జమ చేస్తోంది. కాబట్టి మార్చి 31 దాకా కూడా పాత నగదు హుండీలో పడే అవకాశముంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

500 యేళ్ళ నాడే తిరుమలలో అన్నదానం.. ఎవరు ప్రారంభించారంటే...