శ్రీకాళహస్తిలో భిక్షాల గోపురం కూలిపోతోంది... పట్టించుకోరా...!
నాడు రాజగోపురం.. నేడు భిక్షాల గాలి గోపరం... ఏది కుప్పకూలుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. భిక్షాల గాలి గోపురానికి సంబంధించిన ప్రతిమ ఊడిపడినా ముక్కంటి ఆలయ అధికారుల తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు కని
నాడు రాజగోపురం.. నేడు భిక్షాల గాలి గోపరం... ఏది కుప్పకూలుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. భిక్షాల గాలి గోపురానికి సంబంధించిన ప్రతిమ ఊడిపడినా ముక్కంటి ఆలయ అధికారుల తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. భక్తులు ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ద్వారం ఇదే. ఆలయ స్థల పురాణాన్ని బట్టి.. ఉత్తర, దక్షిణ ముఖాలతో ఉన్న ఈ గోపురాన్ని 12వ శతాబ్థంలో వీరనరసింహరాయలు నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన గోపురాన్ని సంరక్షించడంలో శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు శ్రద్థ చూపడం లేదన్న విమర్సలు లేకపోలేదు.
వానొస్తే చాలు.. రాజగోపురం కుప్పకూలాక మిగిలిన ఆలయ గోపురాల పటిష్టతకు సంబంధించి ప్రభుత్వం నియమించిన గోపురాల అధ్యయనాల కమిటీ పలు దఫాలు ఇక్కడి నిర్మాణాలను సందర్సించింది. ప్రధానంగా గోపురాలపై పిచ్చిమొక్కలు మొలకెత్తనీయకుండా చేయాలని, అలా ఇచ్చిన మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ రావాలంటూ ఈ బృందం స్పష్టం చేసింది. అయితే ఇక్కడి అధికారులు మాత్రం ఆ దిశగా శ్రద్థ తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
దీంతో వర్షాకాలం వస్తే చాలు.. గోపురాలపై మ్రొక్కలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా గోపురాలపై అమర్చిన ప్రతిమలు, రాళ్ళకు మధ్యలో మ్రొక్కలు మొలకెత్తడం వల్ల అక్క ఖాళీ ప్రదేశం ఏర్పాటవుతోంది. వర్షాలకు వర్షపునీరంతా వాటి గుండా వెళ్ళి గోపురాలన్నీ మరింతగా నానిపోయే విధంగా చేస్తున్నాయి. దీంతో తరచూ పెచ్చులూడటం ప్రతిమలు వూడిపోవడం జరుగుతూనే ఉన్నాయి.
ఇదే గోపురం నుంచి పలు దఫాలు పెచ్చులూడిన సంఘటనలు అనేకం. గత వారం క్రితం రాత్రి సమయంలో ఒక్కసారిగా గోపుర శిఖాలకు దిగువ వైపున ఓ ప్రతిమ నానిపోయి కిందపోయింది. అయితే ఉత్తర, దక్షిణం వైపు కాకుండా పశ్చిమం వైపు అందులోను, సమీపంలోను కాశీ విశ్వనాథస్వామి ఆలయ ప్రాంగణంలో పడిపోయింది. దీంతో ప్రమాదం తృటిలో తప్పింది.
అయితే ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారగణం శ్రద్థ వహించాల్సి ఉంది. అంతేకాదు ఆర్కెటిక్ నిపుణులను శ్రీకాళహస్తికి తీసుకువచ్చి భిక్షాల గోపురం ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. గతంలో గాలిగోపురం కూలిపోయిన సమయంలో ప్రాణనష్టం జరగలేదు. కోతులు మాత్రం ఎక్కువగా గాలిగోపురం కింది ప్రాంతంలో పడి చనిపోయాయి. అయితే భిక్షాల గోపురం అలాంటి పరిస్థితి లేకపోయినా శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు నిద్రలేవకపోతే తీవ్రనష్టం తప్పదని భక్తులు అంటున్నారు.