Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు... పోతులూరి వీరబ్రహ్మం

పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని ఇప్పటికే జరిగిపోయాయి. మరికొన్ని జరుగుతాయి అనేందుకు గత చరిత్రే నిదర్శనం. పోతులూరు వీరబ్రహ్మం చెప్పిన కాలజ్ఞానంలో కొన్ని అంశాలను పరిశీలిస్తే... బెజవాడ కనకదుర్గ

Advertiesment
potuluri veera brahmendra swamy kalagnanam
, శనివారం, 31 డిశెంబరు 2016 (11:58 IST)
పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని ఇప్పటికే జరిగిపోయాయి. మరికొన్ని జరుగుతాయి అనేందుకు గత చరిత్రే నిదర్శనం. పోతులూరు వీరబ్రహ్మం చెప్పిన కాలజ్ఞానంలో కొన్ని అంశాలను పరిశీలిస్తే... బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
 
నలు దిక్కులయందు దివ్యమైన నక్షత్రాలుపుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి. అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశినాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
 
కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది. కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది. కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది. ఉత్తరదేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి. అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి.
 
తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికి కనిపిస్తుంది. ఆకాశం ఎర్రపడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి. మాహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు బదిలీ.. వైకుంఠ ఏకాదశి తరువాత..?