Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో ఛత్రపతి శివాజీ పూజించిన దేవాలయం... కోరిన కోర్కెలు నెరవేరుతాయ్...

తమిళనాడు రాజధాని చెన్నైలోని తంబుశెట్టి వీధి, ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో కొలువై వున్న కాళికాదేవి అమ్మవారు శివపరమాత్మ కమఠేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. క్రీ.శ 1677 అక్టోబరు 3వ తేదీన ఈ తల్లిని దర్శించుకు

చెన్నైలో ఛత్రపతి శివాజీ పూజించిన దేవాలయం... కోరిన కోర్కెలు నెరవేరుతాయ్...
, శుక్రవారం, 26 మే 2017 (12:40 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలోని తంబుశెట్టి వీధి, ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో కొలువై వున్న కాళికాదేవి అమ్మవారు శివపరమాత్మ కమఠేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. క్రీ.శ 1677 అక్టోబరు 3వ తేదీన ఈ తల్లిని దర్శించుకుని పూజలు చేసిన ఛత్రపతి శివాజీ తదనంతరం పలు యుద్ధాల్లో విజయం సాధించాడట. 
 
ఒకప్పుడు సముద్ర తీరాన ఈ ఆలయం వుండేదనీ, ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని ఇక్కడకు మార్చారని చెపుతారు. ఆలయంలో మహావిష్ణు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, నవగ్రహాలతోపాటు అగస్త్యుడు, అంగీరసుడు తదితర మునీశ్వరులున్నారు. ఈ ఆలయంలో దర్శన వేళలు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ. అమ్మను దర్శించుకున్న వారికి కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు ఉగ్రముప్పు - రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు...