Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల యాత్రకు ముందు... చెన్నై వండలూర్ శ్రీలక్ష్మి కుబేరుడిని దర్శించుకుంటే?

చెన్నై నగరంలో వండలూర్ సమీపంలోని రత్నమంగళం అనే గ్రామంలో నిర్మితమైన శ్రీలక్ష్మీ కుబేరుడి గుడి ఎంతో ప్రసిద్ధమైనది. ఈ గుడిని దర్శించుకుంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని ప్రతీతి. సంపదలకు దేవత శ్రీ మహాలక్ష్మి, కుబేరుడు వాటికి నిర్వాహకుడు. కుబేర పూజ అనేది స్థి

తిరుమల యాత్రకు ముందు... చెన్నై వండలూర్ శ్రీలక్ష్మి కుబేరుడిని దర్శించుకుంటే?
, శుక్రవారం, 16 జూన్ 2017 (13:50 IST)
చెన్నై నగరంలో వండలూర్ సమీపంలోని రత్నమంగళం అనే గ్రామంలో నిర్మితమైన శ్రీలక్ష్మీ కుబేరుడి గుడి ఎంతో ప్రసిద్ధమైనది. ఈ గుడిని దర్శించుకుంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని ప్రతీతి. సంపదలకు దేవత శ్రీ మహాలక్ష్మి, కుబేరుడు వాటికి నిర్వాహకుడు. కుబేర పూజ అనేది స్థిరమైన సంపదలతో తులతూగడానికి ఈ ఇద్దరికీ చేసే పూజ. 
 
ఈ పూజ వలన సిరిసంపదలు చేకూరడమే కాకుండా పోగొట్టుకున్న పాత సంపద కూడా త్వరగా తిరిగి వస్తుందని నమ్మకం. ఈ పుణ్యక్షేత్రంలో కుబేరుడు ఎడమచేతిలో సంగనిధి కుండ, కుడిచేతిలో పద్మనిధి కుండతో తల్లి శ్రీ మహాలక్ష్మి మరియు సతి చిత్తరిణి (చిత్రలేఖ) సమేతంగా విలసిల్లుతున్నాడు. 
 
కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి తన పెళ్లి కోసం కుబేరుడి వద్ద అప్పు తీసుకుని ఇంకా వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు. కనుక తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే ముందు ఈ గుడిని సందర్శిస్తే మరిన్ని సత్ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్టీ అమలుతో శ్రీవారి లడ్డూ ధర అప్.. గదులు, దర్శనటిక్కెట్లు కూడా..