మీరు భోజనానికి ఎలాంటి పాత్రలు వాడుతున్నారు..!?
భాగ్యాన్ని కోరేవారు మఱ్ఱి, జిల్లేడు, రావి, కలిగొట్టు, తుమ్మికి, కానుగు ఆకులు వాడరాదని పైఠీనసివచనం. మోదుగ, తామర గృహస్థులకు పనికి రాదని, సన్యాసులకు పనికొస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే బంగారం, వెండి, కంచు, తామరాకు, మోదుగాకులను భోజనపాత్రలుగా ఉపయోగించుకోవచ్చు. కంచుపాత్ర గృహస్తులకు మంచిది. కంచుపాత్ర, తాంబూలం, తలంటుకోవడం-ఇవి బ్రహ్మచారులకు, యతులకు పనికివారన్నారు. భోజనం పాత్ర వేసేటప్పుడు పాత్రలో మొదట నేతిని చూపించాలి. ఆకులమీదగాని, ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చొని తినడం ఆచారం.ఆహారం తీసుకునేటప్పుడు ముందుగా తీపి తినాలి. పాలుపోసుకున్న తర్వాత పెరుగు పోసుకోకూడదని బ్రహ్మపురాణంలో ఉంది. కాళ్ళు బారచాపుకుని, ఎడమకాలి చేస్తో ముట్టుకుంటూ చెప్పులు వేసుకుని ఆహారం తినకూడదు. ఎడమచేత్తో తినడంగాని, తాగడం కాని పనికిరాదు. భోజనం చేయడం పూర్తయ్యాక అన్నీ తినకుండా కాస్త కాస్త విడిచిపెట్టాలి. అయితే పెరుగు, తేనె, నేయి, పాలు, సత్తుపిండి మాత్రం పూర్తిగా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.