Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రాలను ఇష్టం వచ్చినట్లు చదువ వచ్చా..!?

Advertiesment
మంత్రాలు
FILE
మంత్రాలు అంటే అక్షరాలే కదా. ఎలా చదివితేనేమి అని అనుకోకూడదు. మంత్రాక్షరాలను సక్రమరీతిలో చదువకపోతే వాటి అర్థాలే మారిపోతాయి. చాలా అనర్థం జరుగుతుంది. అలాంటి సంఘటన గురించిన ఒక పురాణకథను గురించి తెలుసుకుందాం.

వృత్రాసురుడు ఇంద్రుని శత్రువు. ఇంద్రుడిని జయించాలనే కోరికతో ఒక పెద్దయాగం చేయించాడు. యాగం బ్రహ్మాండంగా జరిగింది. వెంటనే వృత్రాసురుడు ఇంద్రునిపైకి దండెత్తిపోయాడు. యుద్ధం ముమ్మరంగా జరిగింది. వృత్రాసురునిదే విజయం అనుకున్నారందరూ. అయితే కడపటికి అతడే మరణించాడు.

దీంతో యాగం చేసిన పురోహితులను కొందరు మునులు, నిలదీసి అడిగారు. "మీలాంటి పురోహితుల వల్ల యజ్ఞం అంటే విశ్వాసం నశించిపోతుంది. మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు." అని అన్నారు.

అందుకు ఆ పురోహితులు మునీంద్రులారా! ఇది మా పొరపాటు కాదు. వృతాసురుడు స్వయంగా మంత్రాలను చదువవలసిన యాగం అది. అతడు మంత్రోచ్ఛాటనలో తప్పుగా పలికాడు. అతడు మంత్రాన్ని దోషభూయిష్టంగా పఠించాడు. ఆ మంత్రం ఏమిటంటే.."ఇంద్ర శత్రుర్వర్ధస్వ". అంటే ఇంద్రుని శత్రువైన నేను అతనికంటే బలవంతుడిని అగుదునుకాక అని అర్థం

అయితే అతడు ఆ మంత్రాన్ని మరోవిధంగా అంటే "ఇంద్రశ్శత్రుర్వర్ధస్వ" అని దీని అర్థం ఇలా మారిపోయింది. నాకు శత్రువైన ఇంద్రుడు వర్ధిలుగాక అని పఠించాడన్న మాట. మంత్రంలో 'శ' అక్షరాన్ని 'శ్శ' అని ఒత్తిపలకడంలో అలాంటి వ్యతిరేకమైన విపరీతార్థం కలిగింది.

అందువల్ల యాగ ఫలం చేసిన వానికి చెడును, విరోధికి మేలూ కలిగించింది. మంత్రాలను ఇష్టం వచ్చినట్లు చదివితే విపరీతార్థం ఏర్పడి హాని కలిగిస్తుంది. మంత్రాలను ఒకటికి పదిసార్లయినా మననం చేసుకుని సక్రమంగా పఠించాలని పురోహితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu