Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివసహస్రనామ ఫలితం దక్కాలంటే...?

Advertiesment
ఆధ్యాత్మికం ప్రార్థన శివసహస్రనామ ఫలితం  పార్వతీ దేవి పరమశివుడు కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
ఒకసారి పార్వతీ దేవి పరమశివునిని... "కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం" అని విష్ణు సహస్రనామ సోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు ఓ పార్వతీ దేవీ నేను.. నిరంతరం విష్ణు సహస్ర నామ ఫలితం కోసం...

"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్సుల్యం రామనామ వరాననే" 2

అని మూడుసార్లు స్మరిస్తానని శివపరమాత్మ దేవీతో చెప్పారు. ఈ స్తోత్రాన్ని మూడుసార్లు స్మరించినట్లైతే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాకుండా, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పార్వతీ దేవీతో శివుడు చెప్పినట్లు శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

అందుచేత కార్తీక మాసంలో ఈ స్తోత్రమును ప్రతిరోజు మూడు సార్లు చెబితే శివపరమాత్మను ధ్యానించినట్లవుతుందని విశ్వాసం. అంతేకాదు... ఈ స్తోత్రానికి మరో విశేషం కూడా ఉంది. కాశీలో భక్తులు జీవిస్తూ... ఆ పుణ్యక్షేత్రమందు మరణించిన వారి కుడిచెవిలో ఈ స్తోత్రాన్ని చెప్పి, సద్గతి కలిగిస్తారన్నది భక్తుల విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu