ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఒక పూట భోజనం చేసి పై శ్లోకముతో మహావిష్ణువును ప్రార్థించినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా ఏకాదశి నాడే ఈ మంత్రోపచారణ చేయడం ఉత్తమం. ఆ రోజునే "విష్ణుశయనోత్సవం" జరుపుతారు. కావున ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే... కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. అంతేగాకుండా ఈ రోజున ఉపవాస జాగరణలు చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.
ఇకపోతే... ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి మహావిష్ణువును విష్ణుసహస్రనామముతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.