Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శని దోషాలు తొలగిపోవాలంటే.. హనుమంతునికి వెన్నతో?

అశోక వనంలో ఉన్న సీతమ్మ వద్దకు రాములవారు హనుమంతుడు సందేశము పంపినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారని పురాణాలు చెప్తున్నాయి. అశోకవనంలో సీతమ్మ తల్లికి పువ్వులు కనిపించకపోవడంతో.. తమలపా

శని దోషాలు తొలగిపోవాలంటే.. హనుమంతునికి వెన్నతో?
, మంగళవారం, 30 మే 2017 (14:38 IST)
అశోక వనంలో ఉన్న సీతమ్మ వద్దకు రాములవారు హనుమంతుడు సందేశము పంపినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారని పురాణాలు చెప్తున్నాయి. అశోకవనంలో సీతమ్మ తల్లికి పువ్వులు కనిపించకపోవడంతో.. తమలపాకులతో మాల వేశారు. అందుకే హనుమంతునికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెప్తున్నాయి. 
 
 ఇంకా ఆంజనేయ స్వామికి పరిమళంతో కూడిన పువ్వులను సమర్పించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అందుకే హనుమంతునికి గురువారం పూట మల్లెపువ్వులతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. గురువారం పూట శుచిగా రామభక్తుడైన హనుమంతునికి మల్లెపువ్వులతో మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతానప్రాప్తి చేకూరుతుంది. 
 
తమలపాకుల దండను సమర్పించిన వారికి కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు సూచిస్తున్నారు. శనిదోషాలు తొలగిపోవాలంటే.. శనివారం లేదా గురువారం పూట హనుమంతునికి వెన్నతో అభిషేకం చేయించాలి. అలాగే ఎరుపు పువ్వులు, తులసి, సింధూరంతో స్వామివారికి అర్చించాలని పండితులు చెప్తున్నారు. ఇంకా ఆంజేనయ స్వామికి పాలు, పెరుగులతో కూడా అభిషేకం చేయించవచ్చు. మంచి రోజు చూసుకుని హనుమంతునికి అభిషేకం చేయించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు నిత్యం ఉండాలంటే.. నాలుగు మూలల్లో..