Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Advertiesment
Latha Mangeshkar

సెల్వి

, గురువారం, 6 ఫిబ్రవరి 2025 (18:51 IST)
Latha Mangeshkar
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ప్రతిభ ఐదేళ్ల ప్రాయంలోనే వెలుగులోకి వచ్చింది. లతా మంగేష్కర్ తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక శాస్త్రీయ గాయకుడు, నాటక కళాకారుడు. ఆయన సంగీత నాటకాలు నిర్మించే నాటక సంస్థను నడిపేవారు. లత ఐదు సంవత్సరాల వయసులో ఈ కంపెనీలో చేరింది. ఆమె తండ్రి ఆమె గాన ప్రతిభను మొదటిసారి చూసిన వయసు ఇది. లత చిన్ననాటి పేరు హేమ కాదని, హృదయ. ఆమె సోదరుడు (హృదయనాథ్ మంగేష్కర్) పుట్టిన తరువాత, ఆమెకు హేమ అని పేరు పెట్టారు.
 
లతా మంగేష్కర్ తన తండ్రితో పాటు, అమన్ అలీ ఖాన్, అమానత్ ఖాన్ వంటి విద్వాంసుల నుండి కూడా సంగీతం నేర్చుకున్నారు. ఆమె 1942 మరాఠీ చిత్రం 'కితి హసల్' కోసం తన మొదటి పాట 'నాచు యా గదే, ఖేలుసరి మణి హౌస్ భారీ'ని రికార్డ్ చేసింది.
 
లతా మంగేష్కర్ నేపథ్య గాయనిగా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు, నూర్ జెహాన్ మరియు షంషాద్ బేగం వంటి శక్తివంతమైన స్వరాలు ఆధిపత్యం చెలాయించాయి. బాలీవుడ్ నటి మధుబాల తన కోసం లతను పాడమని పట్టుబట్టింది. ఆపై లతా మంగేష్కర్ నేపథ్య గాయనిగా ఓ వెలుగు వెలిగింది. అయితే 1962లో, లతా మంగేష్కర్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దర్యాప్తులో ఎవరో ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారని తేలింది. మూడు రోజులుగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 
webdunia
Latha Mangeshkar
 
భారతదేశం చైనాతో యుద్ధంలో ఓడిపోయింది. మన సైనికులు చాలా మంది అమరులయ్యారు. ఆ సమయంలో, ఒక కార్యక్రమంలో అమరవీరులకు నివాళులు అర్పించడానికి లతా మంగేష్కర్ 'ఏ మేరే వతన్ కే లోగోన్' పాట పాడినప్పుడు, అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కూడా అక్కడే ఉన్నారు.
 
లతా మంగేష్కర్ ఇష్టమైన క్రీడ క్రికెట్. 1983లో భారతదేశం మొదటిసారి క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు, లతా మంగేష్కర్ ఒక కచేరీ కోసం లండన్‌లో ఉన్నారు.
 
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె ఎటువంటి రుసుము వసూలు చేయకుండా విజేత జట్టు కోసం డబ్బును సేకరించడానికి బీసీసీఐ నిర్వహించిన కచేరీలో పాల్గొన్నారు. దీని ద్వారా 20 లక్షల రూపాయలు సేకరించడం జరిగింది. ఈ డబ్బును క్రీడాకారులకు అందజేసింది. 
 
లతా మంగేష్కర్ వివాహం చేసుకోలేదు. ఒక ఇంటర్వ్యూలో, పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ, తాను చాలాసార్లు పెళ్లి గురించి ఆలోచించానని, కానీ తాను అలా చేసుకోలేకపోయానని చెప్పారు.
 
అది 60ల కాలం. ఆ సమయంలో, లతా మంగేష్కర్‌కు మొహమ్మద్ రఫీకి మధ్య వైరం ఉందనే వార్తలు బాగా చర్చనీయాంశమయ్యాయి. లతాజీ కలిసి పనిచేసిన అందరు సంగీతకారులలో, మదన్ మోహన్‌తో ఆమెకున్న సంబంధం అత్యంత ప్రత్యేకమైనది.
 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సెప్టెంబర్ 28, 1929న జన్మించారు. 30 వేలకు పైగా పాటలు పాడారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు దక్కించుకున్న లతాజీ భారతీయ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుతో సత్కరించింది. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి తరువాత భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు. 
webdunia
Latha Mangeshkar
 
తెలుగులో 1955లో ఏఎన్నార్‌ సంతానం సినిమా కోసం నిదుర పోరా తమ్ముడా, 1965లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట, 1988లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీరకు పాట పాడారు. లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6, 2022లో తుదిశ్వాస విడిచారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?